నిరుపేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్
-19 లక్షల 85 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పఠాన్ చేరు, (లోకల్ గైడ్): నిరుపేదలకు కార్పోరేట్ వైద్యం అందించడంలో సిఎం సహాయనిధి అండగా నిలుస్తోందని పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పఠాన్ చేరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన 19 లక్షల 85 వేల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..కార్పొరేట్ ఆసుపత్రులలో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయనిధి ద్వారా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తూ వారి ఆర్థిక అభ్యున్నతికి అండగా ఉంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, ప్రమోద్ గౌడ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.
Comment List