"నాకు కన్నడ రావదు!" – SBI చందాపుర బ్రాంచ్ మేనేజర్ తీరుతో కలకలం, రాత్రికి రాత్రే బదిలీ
కన్నడ మాట్లాడాలని అడిగిన కస్టమర్పై దురుసుగా స్పందించిన SBI మేనేజర్ – వీడియో వైరల్, ప్రజల ఆగ్రహంతో మేనేజర్ను తక్షణం బదిలీ చేసిన బ్యాంకు
వివరణ:
కర్ణాటక రాష్ట్రంలోని చందాపురలోని SBI బ్రాంచ్ మేనేజర్, కన్నడ మాట్లాడమన్న కస్టమర్ను "నేను ఎప్పటికీ కన్నడ మాట్లాడను, కర్ణాటక మాత్రమే ఇండియా కాదు" అంటూ తీవ్రంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ప్రజలు, కన్నడ ఉద్యమకారులు, రాజకీయ నాయకులు పెద్దఎత్తున స్పందించడంతో SBI అధికారులపై ఒత్తిడి పెరిగింది. దాంతో మెనేజర్ను రాత్రికి రాత్రే ఇతర రాష్ట్రానికి బదిలీ చేశారు.
ఈ వివాదం ఓ వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. అందులో మేనేజర్ తన ధృడమైన వైఖరితో కస్టమర్ను హిందీలో మాట్లాడమంటూ ఒత్తిడి చేస్తూ కనిపించగా, కస్టమర్ ఆర్బీఐ త్రిభాషా విధానం గురించి చెప్పినప్పటికీ ఆమె వినిపించుకోలేదు.
ప్రజా ప్రతిస్పందన:
ఈ ఘటనపై కన్నడ భాషాభిమానులు, ప్రజలు, నేతలు తీవ్రంగా స్పందించారు. బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వి సూర్య, తన X (ట్విట్టర్) ఖాతాలో “ఈ విధమైన ప్రవర్తన అసహ్యతరం. కర్ణాటకలో బ్యాంకులు కన్నడలో సేవలు ఇవ్వాలి – ఇదే మేము కోరేది” అంటూ స్ట్రాంగ్ వ్యాఖ్యలు చేశారు.
కన్నడ రక్షణ వేదిక నేత బసవరాజు పడుకోటే మాట్లాడుతూ, “మనం SBIకి నెలరోజుల గడువు ఇస్తున్నాం – ప్రతి బ్రాంచ్ మేనేజర్ కన్నడ నేర్చుకోవాలి, లేకపోతే ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి,” అన్నారు. “ఇలాంటి మైండ్సెట్ ఉన్న అధికారులను తొలగించాలి,” అని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్పందన:
ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా స్పందించారు. మేనేజర్ ప్రవర్తనను ఖండిస్తూ, SBI తక్షణ చర్యలను అభినందించారు. అంతే కాదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థానికులకు ఉపాధి అవకాశాలపై ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు నేతలు, సంఘాలు కోరుతున్నాయి.
ఘర్షణలకు దారితీసిన ఘటన:
వివాదం తీవ్రతకు దారితీసి, కన్నడ ఉద్యమకారులు SBI చందాపుర బ్రాంచ్ను చుట్టుముట్టి, మేనేజర్ క్షమాపణ చెప్పే వరకు అక్కడే బైఠాయించారు. బ్రాంచ్ వద్ద ప్రదర్శనలు, నినాదాలు, ఉద్యోగ
Comment List