త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ...

త్రివిధ ద‌ళాధిప‌తుల‌తో కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ భేటీ...

లోక‌ల్ గైడ్ : 
 త్రివిధ దళాధిపతులతో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఇవాళ ఉదయం ఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో జరిగింది. ఇందులో సీడీఎస్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, వైస్ ఎయిర్ చీఫ్ మరియు రక్షణ కార్యదర్శి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాల్పుల విరమణ, ఆపరేషన్ సిందూర్, సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై వివరంగా చర్చించారని సమాచారం.పాకిస్థాన్ ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదంపై భారత్‌ ప్రతీకారం తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్‌కు గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. ఈ నేపథ్యంలో పలు దేశాల సైనిక రాయబారులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బ్రీఫింగ్ ఇవ్వనుంది. మధ్యాహ్నం 3:30కి ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ బ్రీఫింగ్‌లో ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించిన కీలక అంశాలను ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకోనున్నారు. దానికి ముందు త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి గ్రామీణ బంద్ ను జయప్రదం చేయండి
గద్వాల, లోకల్ గైడ్ :గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ కొరకు ఈ నెల 20న జరిగే దేశవ్యాప్త గ్రామీణ బంద్ ను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా...
కాళేశ్వరం సరస్వతి పుష్కరాల ప్రదేశం డ్రోన్ దృశ్యాలు.
క్రేజీ కాంబోలో సినిమా... 
పగడ్బందీగా ధాన్యం సేకరణ
వరి ధాన్యం తూకం జాగ్రత
జాతీయ బీసీ సేన అయ్యవారిపల్లి మహిళ గ్రామ కమిటి ఎన్నిక 
‘వరంగల్​.. జరూర్​ ఆనా ’