దేశం కోసం సనాతన ధర్మం కోసం పోరాడిన వీర వనిత అహల్య భాయి హోల్కర్
- రాష్ట్ర మహిళా మోర్చా డేటా సెల్ కన్వీనర్ విజయ భవాని.
గద్వాల, లోకల్ గైడ్ :
దేశం కోసం సనాతన ధర్మం కోసం పోరాడిన వీర వనిత లోకమాత అహల్య భాయి హోల్కర్ అని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా డేటా సెల్ కన్వీనర్ విజయ భవాని అన్నారు. లోక మాత, రాజమాత అహల్య భాయి హోల్కర్ 300వ జయంతి ఉత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని డికె. బంగ్లాలో జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో జిల్లా కార్యశాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా మోర్చా డేటా సెల్ కన్వీనర్ విజయ భవాని హాజరయ్యారు. రాజమాత అహల్య భాయ్ ఒక సాధారణ కుటుంబంలో పుట్టిందన్నారు. ఆమె గొప్ప శివ భక్తురాలని, 1733లో అతి చిన్న వయసులో వివాహమైన ఆహల్య భాయికి 1754లో ఓ యుద్ధంలో అహల్య భాయి భర్త మరణించడంతో చిన్న వయసులోని రాజ్యాధికారం చేపట్టిందన్నారు. 30 ఏళ్ల పాలలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసి తన హయాంలో పెద్ద సంఖ్యలో కోటలు దేవాలయాలు నిర్మించి పరిపాలన సమయంలో దానధర్మాలకు మారుపేరుగా నిలిచారని తెలిపారు. మహేశ్వరం చీరలు అను కొత్త నేతను అందుబాటులోనికి తెచ్చి ప్రజలు ఈ చీరల పట్ల అత్యంత మక్కువ చూపేవారన్నారు. ఈనాటికీ మహేశ్వరం చీరలు మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా ప్రసిద్ధి చెందాయనడంలో అతిశయోక్తి లేదన్నారు. అహిల్యాబాయి మహేశ్వరంలో పెద్ద వస్త్ర పరిశ్రమను స్థాపించింది. సంతానం లేని వితంతువుల ఆస్తులు జప్తు చేయాలనే విధానాన్ని అహల్యా భాయ్ రద్దు చేసిందన్నారు. అహల్యా భాయి పాలన మరాఠా సామ్రాజ్య చరిత్రలోసువర్ణ యుగంగా గుర్తుంది పోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డికె. స్నిగ్దా రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి, కన్వీనర్ రవికుమార్ ఎక్బోటే, కో కన్వీనర్ అక్కల రమాదేవి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, గద్వాల పోటీ చేసిన అభ్యర్థి బలిగేరా శివారెడ్డి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు దేవా దాస్, మెంబర్స్ స్వప్న, శోభారాణి, తదితరులు ఉన్నారు.
Comment List