నిద్రలేవండి అధికారులారా! విద్యుత్ నిర్లక్ష్యానికి బలవుతున్న చిన్నారులు
నిర్లక్ష్యం... నిర్లక్ష్యం ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే? అటు గ్రామాల్లో ఇటు పట్టణాలలో విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యానికి బలైపోతున్న విద్యార్థులు. నేడు ఎక్కడ చూసినా కంచలేని ట్రాన్స్ఫారాలు, విరిగిపోయిన స్తంభాలు, వేలాడుతున్న వైర్లు దర్శనమిస్తున్నాయి. వర్షాకాలం సమీపిస్తున్న ఇప్పటివరకు అధికారులు స్పందించడం లేదు. చాలా మంది చిన్నారులు, ప్రజలు విద్యుత్తు షాకుకు గురై చనిపోతున్నారు. వివిధ పార్టీ నాయకులు విద్యుత్తు అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించిన కూడా పట్టించుకోవడం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి. బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కావు. విద్యుత్ ఘాతానికి బలైపోయిన చిన్నారుల తల్లిదండ్రుల ఆవేదన చూస్తే ఎంతో బాధేస్తుంది. ఒక తల్లి అరుపు ఒక తండ్రి కన్నీరు ఓ చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయిన శబ్దంలేని శోకం నేడు గ్రామాల్లో, పట్టణలో ఎక్కడో ఒకచోట ఓ పిల్లవాడు విద్యుత్ తాకిడికి గురవుతున్నాడు. కానీ ఎందుకు? ఎవరు బాధ్యత వహించాలి? ఎవరు నిద్రలేచి స్పందించాలి?
తెల్లవారు జామున విద్యుత్ స్తంభాల చుట్టూ పెరిగిన బద్దలు, తెరచిన బాక్స్లు, భోగిసలాడుతున్న తీగలు చూస్తున్నాం.గమనించలేని నిర్లక్ష్యం మన పిల్లల భవిష్యత్తును మింగేస్తోంది. ఓ చిన్నారి స్కూలుకు వెళ్తూ ఓ ఓపెన్ బాక్స్ను తాకి ప్రాణం కోల్పోయింది. 10 సంవత్సరాల వయసు గల విద్యార్థి సైకిల్ తొక్కుతూ విద్యుత్ ట్రాన్స్ఫారంకు అనుకోకుండా తగిలి చనిపోయాడు.ఇకనైనా విద్యుత్ శాఖ బాధ్యత తీసుకోండి, తప్పులు ఒప్పుకోండి ప్రతిరోజూ వందల కొద్దీ ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో, పట్టణాల్లో తీగలు కిందపడిపోయాయి పోల్స్ మానిటరింగ్ లేదు,ట్రాన్స్ఫార్మర్ ఓపెన్గా ఉంది. ఈ అంశాలపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారు. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందిస్తే ప్రజల ప్రాణాలు ఇలాంటి సంఘటనలు జరగవు.మనం కూడా నిమ్మలంగా ఉండకూడదు
కేవలం ప్రభుత్వ అధికారులపై వేయడం సరిపోదు. మనం నివసిస్తున్న ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులుంటే వాటిని గుర్తించి స్థానిక అధికారులకు తెలియజేయాలి. సోషల్ మీడియాలో, స్థానిక వార్తా చానళ్లలో ప్రచారం చేయాలి.
పిల్లల భద్రతకు ఇది మన కర్తవ్యం.
పిల్లలు పుస్తకాలు పట్టుకోవాలి, తీగలు కాదు ఒక చిన్నారి విద్యార్థిగా పెరగాల ప్రమాదంలో పడిపోయే బలిగా మారాలా? వ్యవస్థ ముందు నిలిచిన ప్రతిబింబం. విద్యుత్ శాఖ అధికారులూ, మున్సిపల్ అధికారులు మీ కార్యాలయాల్లో ఏసీ కింద నిద్రపోతున్న మీరు నిద్రలేడి చూడండి.ఓ ఇంట్లో చిమ్మటి వెలుతురు కమ్ముకునే ముందు
ఓ తల్లి కన్నీరు కారుస్తోంది.
ఈ పరిస్థితి మరో కుటుంబాన్ని కబళించేలోపు, కార్యాచరణ ప్రారంభించండి. విద్యుత్ పరిరక్షణకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయండి, వినియోగదారుల ఫిర్యాదులపై వేగంగా స్పందించండి.విద్యుత్ అధికారులు ఈ వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఎక్కడెక్కడ అయితే విద్యుత్ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే పరిష్కరిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవు. ముఖ్యంగా అధికారులు ప్రజలకు విద్యార్థులకు అవగాహన కలిగించాలి వర్షాకాలంలో ఎక్కడన్నా విద్యుత్తు వల్ల ప్రమాదం జరిగితే ముందు జాగ్రత్త చర్యగా ప్రజలు తీసుకోవాల్సిన అంశాల గురించి అవగాహన కల్పించాలి. రాష్ట్రవ్యాప్తంగా అవగాహన అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యపరిస్తే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగవు.
Comment List