కనుల పండుగగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

* పట్టు వస్త్రాలు సమర్పించిన పాలక మండలి చైర్మన్, ఆలయ అధికారులు 

కనుల పండుగగా రేణుక ఎల్లమ్మ కళ్యాణం

* పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు  * అన్నదాన కార్యక్రమం నిర్వహించిన ఆలయ అధికారులు

 నల్లగొండ ( లోకల్ గైడ్,)
కనగల్ మండలం ధర్వేశిపురం లోని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం జమదగ్ని మహర్షి, రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా నిర్వహించారు.డేరం భాస్కర శర్మ, నాగోజు మల్లచారి,శ్రవణ్ కుమార్ ఆచార్యులు, ఉమామహేశ్వరరావు, దామోదర్ రావుల మంత్రోచ్ఛరణ,డప్పు చప్పుళ్ల నడుమ కళ్యాణం నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవ,లలిత సహస్రనామర్చన, బాల భోగ నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కల్యాణోత్సవానికి వడి బియ్యం,పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ చీదేటి వెంకటరెడ్డి దంపతులు,జిల్లా సహాయ కమిషనర్ కే.భాస్కర్, ఆలయ ఈవో జె.జయరామయ్యలు సమర్పించారు.భక్తులు కళ్యాణానికి హాజరై మొక్కులు తీర్చుకున్నారు.భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వేడుకలను వీక్షించారు. దేవస్థానం తరఫున అన్న ప్రసాదం (అన్నదానం) కార్యక్రమం నిర్వహించారు. కనగల్లు ఎస్ఐ పి.విష్ణు ఆధ్వర్యంలో పోలీసులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి,నల్గొండ డిఎస్పి కే.శివరాం రెడ్డి,ఆలయ పరిశీలకులు బి.సుమతి, మాజీ చైర్మన్లు కంచరకుంట్ల గోపాల్ రెడ్డి, సిహెచ్.యాదగిరి గౌడ్,ఎన్.యాదగిరి,కృష్ణయ్య, పాలక మండలి సభ్యులు చెనగోని నగేష్ గౌడ్,రాయల వెంకన్న,నరాల బాబు,జె.నవీన్,కే.శంకర్ రెడ్డి, ఎన్.రాజు,కే.నరేష్,రమేష్, దుర్గమ్మ, ఆలయ సిబ్బంది జినుకుంట్ల చంద్రయ్య,జి. నాగేశ్వరరావు, కూసం ఉపేందర్ రెడ్డి,నకిరేకంటి ఆంజనేయులు,రాజయ్య, జే.నాగరాజు,చెనగోని శ్రీకర్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News