భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా బక్రీద్
-భక్తి పారవశ్యంతో పులకరించిన ఈద్గాలు
-ఈద్-ఉల్- అజ్హా ప్రత్యేక నమాజును గావించిన ముస్లింలు -ఈద్గా వద్ద ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ కే.రాజేష్ రెడ్డి
లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
ముస్లింలు త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను శనివారం భక్తిశ్రద్ధల మధ్య ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డు లోని ఈద్గా వద్ద ముస్లింలు బక్రీద్ సందర్భంగా ఈద్ ఉల్ అజ్హా ప్రత్యేక నమాజును గావించారు. ఈ సందర్భంగా జామియా జామియా అరబిక్ యూనివర్సిటీ మౌలానా అలీం హఫీజ్ మహమ్మద్ షాకీర్ సిద్ధిఖీ బక్రీద్ పండుగ ప్రాముఖ్యతను తెలుపుతూ ఇబ్రహీం అలైహి సలాం అల్లా ఆజ్ఞతో త్యాగనిరతిని చాటుకున్నా ఘటనను కళ్ళకు కట్టినట్లు వివరించారు. ఇస్లాం ధర్మం త్యాగాలకు ప్రతీక అని ఆయన వివరించారు. ప్రతి ముస్లిం ఖురాన్ ను అనుసరిస్తూ మహమ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. సమాజంలో సమానత్వం చూపే ధర్మం ఇస్లాం ధర్మం అని ఆయన అభివర్ణించారు. ముస్లింలు నిష్టతో ఫర్జ్ లను పాటిస్తూ దేవుడు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ కుర్బానీ ఇవ్వాలని సూచించారు. అనంతరం హఫీజ్ మహమ్మద్ మెహబూబ్ అలీ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ బక్రీద్ పండుగ లో అనుసరించాల్సిన నియమాలను నిష్టతో చేయాలని సూచించారు. ఇస్లాం ధర్మంలో ఎలాంటి విషయాలు తెలుసుకోవాలన్న ఆలిం లు హఫీజ్ లు మత గురువులను నేరుగా ఆశ్రయించాలని మీ అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఇస్లాం ధర్మం పట్ల అవగాహన లేని వారిని ఆశ్రయించి తప్పుడు మార్గాలను ఎంచుకోవద్దని సూచించారు. అనంతరం హఫీజ్ మహమ్మద్ నూరుల్ హక్ ఈద్ ఉల్ అజ్హా ప్రత్యేక నమాజును చదివించి ఖుద్బ అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వక్ఫ్ కాంప్లెక్స్ భవన నిర్మాణ కమిటీ కార్యదర్శి అబ్దుల్లా ఖాన్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈద్గా వద్ధ ముస్లింలకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన వివిధ రాజకీయ పార్టీల నాయకులకు ఎమ్మెల్యే డాక్టర్ కూచకుల్ల రాజేష్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారని పంపిన సందేశం ప్రకారం ఎమ్మెల్సీ కూచకుల్లా దామోదర్ రెడ్డి,మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ వివరించారు. ఈద్గా వద్ద మున్సిపాలిటీ నిధుల నుంచి ఏర్పాటుచేసిన పెండల్స్, పారిశుద్ధ్యం పనులు తాగునీటి సౌకర్యం మైక్ సెట్ సౌకర్యం కల్పించిన మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసిన పోలీసు శాఖ కు ముస్లింల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముస్లింలు భారీ సంఖ్యలో బక్రీద్ పండుగ నమాజ్ కోసం తరలివచ్చారు. అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుంటూ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం ఖబ్రస్తాన్ లో తమ కుటుంబ సభ్యుల సమాధుల వద్దకు చేరుకుని గులాబీ పువ్వులు సమర్పించి ప్రత్యేక ఫాతిహాలు సమర్పించుకున్నారు. సమాధి అయినవారి మాగ్ఫిరత్ కోసం ప్రార్థించారు.
Comment List