రేపు సివిల్ సర్వీసెస్ 2025 ప్రిలిమినరీ పరీక్ష
By Ram Reddy
On
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆదివారం సివిల్ సర్వీసెస్-2025 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 47,817 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, హైదరాబాద్లో 43,676 మంది అభ్యర్థుల కోసం 95 పరీక్షా కేంద్రాలు, వరంగల్లో 4,141 మంది కోసం 10 కేంద్రాలు ఏర్పాటు చేశారు. గత సంవత్సరం 49,883 మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి దరఖాస్తుల సంఖ్య 2,066 తక్కువగా ఉంది. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
04 Jun 2025 14:06:45
నిజామాబాద్, లోకల్ గైడ్ : భూ భారతి రెవెన్యూ సదస్సులలో భాగంగా బుధవారం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం మాదాపూర్, ముప్కాల్ మండలం నల్లూర్, కిసాన్ నగర్...
Comment List