వర్షాకాలంలో రాగి జావ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

వర్షాకాలంలో రాగి జావ తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు

రాగి జావ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తూ చలువగా మారుతుంది. అందుకే వేసవిలో రాగి జావ తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, వేసవి ముగిసిన తర్వాత చాలామంది దీన్ని మానేస్తారు. కానీ పోషకాహార నిపుణుల మాట ప్రకారం, రాగి జావను ఏ సీజన్‌లోనైనా తాగవచ్చు. వర్షాకాలంలో అయితే ప్రత్యేకంగా దీన్ని తీసుకోవాలంటున్నారు.వర్షాకాలంలో శరీరంలో జీర్ణవ్యవస్థ మందగిస్తుండటంతో పేగుల్లో తేమ పెరిగి మెటాబాలిజం తగ్గిపోతుంది. ఇలాంటి సమయంలో రాగి జావ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ సజీవంగా మారుతుంది. ఇది తిన్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడమే కాకుండా, మలబద్దకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

విరేచనాల నివారణకు రాగి జావ

వర్షాకాలంలో విరేచనాల సమస్య ఎక్కువగా కనిపించొచ్చు. ఇది శరీరంలోకి ప్రవేశించే క్రిముల వల్ల జరుగుతుంది. రాగి జావలో ఉండే పోషకాలు శరీరంలోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లను నశింపజేస్తాయి. ముఖ్యంగా డయేరియాకు కారణమయ్యే క్రిములను అడ్డుకుంటాయి. దీంతో విరేచనాలు తగ్గుతాయి.

రోగ నిరోధక శక్తి పెంచుతుంది

ఈ కాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా అనారోగ్యానికి గురవుతుంటారు. కానీ రాగి జావ తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి ఇలాంటి ఇన్‌ఫెక్షన్లకు తట్టుకుని నిలబడగలగతాం. రాగిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరం బలంగా మారుతుంది.

ఎముకలకు బలమిస్తూ.. రక్తహీనతను తగ్గిస్తూ

రాగిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. ఎముకలు విరిగినవారికి ఇది మరింత మేలు చేస్తుంది. అలాగే రాగిలో ఉండే ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలించి కణాల నాశనాన్ని నివారిస్తాయి.

షుగర్ లెవల్స్‌కు హానికరం కాదు

రాగి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతో షుగర్ లెవల్స్ పెరగవు. రాగిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే డయాబెటిస్ ఉన్నవారు కూడా నిరభ్యంగా రాగి జావ తాగవచ్చు.

ఎలా తయారు చేయాలి?

రాగి జావ తయారీ చాలా సులువు. సాధారణంగా రాగి పిండి ఉపయోగించి చేస్తారు. అయితే, మరింత పోషకాలు పొందాలంటే రాగిని మొలకెత్తించి ఎండబెట్టి, అప్పుడు దానితో పిండి తయారు చేయాలి. దీన్ని బాగా మరిగించిన నీటిలో కలిపి, మజ్జిగ లేదా పెరుగు వేసి తాగితే శరీరానికి తగిన శక్తి అందుతుంది.

ప్రతి ఉదయం రాగి జావ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శక్తి స్థాయిలు మెరుగవుతాయి. డీహైడ్రేషన్ నుంచి రక్షణ లభిస్తుంది. శరీరంలో ద్రవ సమతుల్యం అవుతుంది. అలసట, నీరసం అనేవి ఉండవు.వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే రాగి జావ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది శరీరానికి శక్తిని అందించడంతోపాటు, అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అన్ని వయస్సుల వారు దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే మేలు జరుగుతుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News