నేటి సమాజంలో నిజాయితీకి గుర్తింపు ఎక్కడ?
(లోకల్ గైడ్ జడ్చర్ల)
నిజాయితీ అనేది మనిషి నిజమైన విలువ. అది మన మాటల్లో, పనిలో స్పష్టంగా కనిపించాలి, నిజాయితీ ఉన్నవాడు ఎప్పుడూ నమ్మకంగా ఉంటాడు. నిజాయితీ గల వ్యక్తులకు తాత్కాలికంగా ఇబ్బందులు ఉండవచ్చు కానీ, ఎప్పటికైనా నిజాయితీగల వ్యక్తులే విజయం సాధిస్తారు.ఈ రోజుల్లో సమాజం అభివృద్ధి చెందుతోంది, సాంకేతికతతో ముందుకు సాగుతోంది, కానీ కొన్ని విలువలు మాత్రం కనిపించకుండా పోతున్నాయి. వాటిలో నిజాయితీ ఒకటి. ఒకప్పుడు నిజాయితీగల వ్యక్తి అంటే సమాజంలో గౌరవం,విశ్వాసం, ఆదర్శంగా భావించేవారు.కానీ ఇప్పుడు? నిజాయితీని గమనించే వారు తక్కువగా మారిపోయారు.
నిజాయితీ అంటే నిజం మాట్లాడటం మాత్రమే కాదు అది మన ఆలోచనలు,మాటలు, కర్మలలో స్వచ్ఛత.ఇది మనల్ని మనమే గౌరవించుకునేలా చేస్తుంది.ఒక వ్యక్తి నిజాయితీతో ఉండడం వల్ల ప్రతి మనిషికి మానసిక శాంతి అనిర్వచనీయమై ఉంటుంది.
కానీ గుర్తింపు ఎక్కడ?
ప్రశ్న ఇదే ఈ విలువకు గుర్తింపు ఎక్కడ? సమాజంలో చాలా సందర్భాలలో మోసం చేసే వారు విజయవంతులు అవుతుంటే, నిజాయితీగా ఉండే వారు అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలలో, వ్యాపారాలలో, రాజకీయాలలోనిజాయితీకి అడ్డంకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజాయితీకి బహిరంగంగా గుర్తింపు రావకపోయినా, అది మన వ్యక్తిత్వాన్ని నిర్మించేదిగా ఉంటుంది. ఆత్మసంతృప్తి,మంచి నిద్ర,అంతర్లీనంగా కలిగే గౌరవం ఇవన్నీ నిజాయితీకి ప్రతిఫలాలే.సమయం ఎప్పుడో మన నిజాయితీకి న్యాయం చేస్తుంది.అది కచ్చితంగా జరగదు అనే గ్యారెంటీ లేకపోయినా,మనకు తలదించుకునే అవసరం రాకుండా చూస్తుంది. నిజాయితీ గల వ్యక్తులను గుర్తిస్తే సమాజం ఎప్పుడూ బాగుంటది.గుర్తింపు కోసం కాదు మన మార్గం స్పష్టంగా ఉండేందుకు మనం ఎంత గొప్పవారిగా మారామో కంటే, మనం ఎంత నిజాయితీగా ఉన్నామో అనేది జీవిత గమ్యం.ప్రతి మనిషి గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం పుట్టినప్పుడు ఏమి తీసుకుని రాలేదు. చనిపోయిన తర్వాత వెంట ఏమి తీసుకెళ్లలేము కనుక కనుక బ్రతికి ఉన్నన్ని రోజులు నీతి, నిజాయితీగా జీవిస్తే చనిపోయిన కూడా ఆ మనిషి చేసిన పనులు ఎప్పటికీ గుర్తుంటాయి. ఇకనైనా ప్రతి మనిషి నిజాయితీగా జీవిస్తే జీవితం ఎంతో ఉంటుంది.
🙏🙏
వ్యాసకర్త
వి. జానకి రాములు గౌడ్
లింగంధన.
Comment List