కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...

కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...

కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...తల్లిదండ్రులపై భారం,విద్యార్థులపై ఒత్తిడి... చాలీచాలని వేతనాలతో ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలు... నిలదీస్తే సమస్యలు తలెత్తుతాయని మౌనం వహిస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు...అన్ని తెలిసిన ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్న జిల్లా పాలన యంత్రాంగం, ఆయా విద్యాశాఖ అధికారులు..

 

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: జూన్ 14: (లోకల్ గైడ్)... తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కుప్పలు తెప్పలుగా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి... కొన్ని సందర్భాల్లో అయితే అసలు అనుమతులు ఉన్నాయా లేవా సరైన విద్యాశాఖ నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది లేకుండా అనుమతులు సైతం విద్యాశాఖ అధికారులు ఇస్తున్నారన్న ఆరోపణలు బహటంగా తెలిసిందే.. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతో జరుగుతున్న స్కామ్ పై విద్యార్థి సంఘాలు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న దుస్థితి రాష్ట్రవ్యాప్తంగా నెలకొంది... విద్యాశాఖ నుండి  నియమనిబంధనలు ఉన్నప్పటికీ పాటించని దుస్థితి నెలకోన్నప్పటికీ విద్యాశాఖ అధికారులు సైతం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వెలువెత్తుతున్నాయి.. వాస్తవానికి పాఠశాలల్లో పుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫాములు విక్రయించడానికి వీలు లేదు అయినప్పటికీ విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి..కనీస వసతులు సైతం లేకుండా లేకున్నప్పటికీ అనుమతులు అడ్మిషన్లు సైతం సదరు విద్యాసంస్థ యాజమాన్యాలు చేస్తూనే ఉంటున్నాయి.. ఈ విషయం అన్నీ తెలిసినప్పటికీ సంబంధిగా విద్యాశాఖ అధికారులు సైతం మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతూనే ఉన్నాయి.. నెలల కొద్దీ ఫీజులు వసూలు చేయడం, ర్యాంకుల పేరిట ఆ వయసుకు సంబంధం లేని ఒక ప్రైవేటు సంస్థకు సంబంధించిన పుస్తకాలను మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధనలు విధిస్తూ విక్రయాలు  జరుపుతున్న పరిస్థితి దాపురించింది.. అంతేకాకుండా ర్యాంకుల పేరిట పబ్లిసిటీ పేరిట విద్యలో కొద్దిగా ముందస్తులో చదువుతున్న వారిపై దృష్టి సారిస్తూ మిగిలిన వారిపై అంతంత మాత్రంగా చూడడం మరో విడ్డూరం.. కేవలం ర్యాంకులు వస్తే చాలు.. మరి కొంతమంది విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతాయని కోణంలో వ్యవహరిస్తున్నాయి కొన్ని విద్యాసంస్థలు..కానీ అందరితో సమానంగా వేలాది, లక్షలాది రూపాయల ఫీజు యూనిఫామ్ ఇతర సామాగ్రి మాత్రం అందరితో సమానంగా కొనుగోలు జరిపించడం మాత్రం కచ్చితంగా జరుగుతుంది.. చదువులో ఆంతర్యం మరి మిగిలిన విషయాల్లో అందరితో సమానం అంటే పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందో ఆలోచించాల్సిన పరిస్థితి... కేవలం విద్యా వ్యాపారంగా ధనార్జనేజయంగా పాఠశాలలు కొనసాగుతున్నాయని చెప్పక మానరాదు.. అంతకుమించి కఠినమైన కోచింగ్ పేరుతో అదనపు ఫీజులు వసూలు చేయడం, పిల్లలపై తీవ్ర ఒత్తిడిని పెంచడంపై తల్లిదండ్రులు గళమెత్తుతున్నారు. ఒకప్పటి చదువులకు ఇప్పటి చదువులకు పూర్తిగా విద్యా వ్యాపారంగా మారిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..అసలు విద్యాశాఖ అధికారులకు చూపిస్తున్న విద్యార్థుల ఫీజులు, బస్ సౌకర్యం, సంబంధించి ఫీజులు అలాగే విద్యాబోధన చేసే గురువులకు ఇచ్చే వేతనం ఒకటి చూపిస్తూ బ్యాంకు ఆకౌంట్లో వేసి తిరిగి డబ్బులు డ్రా చేసి తిరిగి అదే పాఠశాల యాజమాన్యానికి అందించడం విద్యాశాఖ అధికారులకు సైతం తెలిసిందే... కానీ పూర్తిగా మౌనం వహించడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది భాగంగా తెలిసిందే.. మరియు ముఖ్యంగా విద్యా బోధన చేసే గురువులకు కావలసిన క్వాలిఫికేషన్ అనేది కూడా పరిగణలోకి తీసుకోకుండా విద్యార్థుల వద్ద వేలాది రూపాయల ఫీజులు దండుకుంటూ చాలీచాలని వేతనాలు చెల్లిస్తూ మామ అనిపిస్తున్న పరిస్థితి నెలకొంది.. ఉదాహరణగా ఒక ఉపాధ్యాయునికి సంబంధిత విద్యాశాఖ అధికారికి అందించే గెజిట్లో 20 వేల రూపాయలు చెల్లిస్తే సదరు ఉపాధ్యాయుడు తన అకౌంట్ నుంచి డబ్బులు స్కూలు యాజమాన్యంతో మాట్లాడుకున్న విధంగా డ్రా చేసుకొచ్చి మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వడం అనేది ఓ పరిపాటిగా మారిపోయింది.. ఇట్టి విషయాలు బయటకు చెబితే తమ పాఠశాలలో విద్యాబోధన చేసే అవకాశం లేకుండా పోతుందని దీంతో ఉపాధి సైతం కోల్పోతామని ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.. ఇదిలా ఉండగా కొంతమంది పాఠశాలలు ఏడాది ఫీజు లక్షల వరకు వసూలు చేస్తున్నా, మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని పేర్కొంటున్నారు. విద్యార్థుల నుండి హాస్టల్, రైటింగ్ మెటీరియల్, పరీక్ష ఫీజు వంటి పేర్లతో అదనంగా వందలు వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు.

పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులతో ఒప్పందాలు లేకుండా భారీ మొత్తాలు అడుగుతుండటంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..కొన్ని పాఠశాలల్లో అసలైన ఉపాధ్యాయులకంటే సరైన క్వాలిఫికేషన్ లేని టీచర్లు, వయసు తక్కువ అయిన వారితో తరగతులు నడుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. చివరికి ఓ పాఠశాల ప్రిన్సిపాల్ హోదా కూడా లేని వారికి అప్పగిస్తున్న పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరిస్థితి లేదు..
విద్యార్థులపై తీవ్ర ఒత్తిడితో పాటు వారిని ర్యాంకుల యంత్రాలుగా మార్చే విధానంపై విద్యా నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయస్సులోనే తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుండడంతో మానసిక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.

ఇక విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ  ప్రైవేట్ విద్యా మాఫియా ఆగడాలు అరికట్టే  దుస్థితిలో లేకపోయిందని విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థుల తల్లిదండ్రులు ఎన్నో ఏళ్లుగా పోరాటాలు ఆవేదనలు వ్యక్తం చేస్తున్నారు... ఇసుక, అక్రమ మైనింగ్, రేషన్ బియ్యం మాఫియా ఇలా చాలా రకాల మాఫియాలు చూసాం ప్రస్తుతం విద్య మాఫియా అనేది చిన్న మధ్య తరగతి ఉన్నతులకు సైతం అందరిని ద్రాక్షగా మారింది... దీనికి కారకులు ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్యాశాఖ మంత్రులు, సంబంధిత జిల్లా పాలన యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ మరియు సంబంధిత అధికారులేనని స్పష్టంగా చెప్పాల్సిన అవసరం లేదని పడు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..  ఇలా చెబుతూ ఉంటే చాలా రకాల విషయాలు అన్ని విద్యాశాఖ మంత్రులతో పాటు చిట్టచివరి వరకు ఉన్న అందరికీ తెలిసినప్పటికీ ఏమి చేయాలని దుస్థితి విద్యావ్యవస్థలో నెలకొందని చెప్పక మానరాదు.. ఇక ఏకంగా ప్రభుత్వ వసతిగృహాలైన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల, కస్తూర్బా గాంధీ మరియు ఇతర వసతి గృహాలు మరియు పాఠశాలల దుస్థితి అయితే పూర్తిగా అటకెక్కిందని చెప్పాల్సిన అవసరమే లేదు... గత కొన్ని నెలల క్రితం విద్యారంగంలో హాస్టల్లో తలెత్తుతున్న సమస్యలు పాఠశాలల్లోని సమస్యలపై అనుమతి పొంది ఉన్న విద్యార్థి సంఘాలను మరియు ప్రజాస్వామ్యంలో నాలుగవ రూపంగా పేర్కొంటున్న మీడియాను సైతం అనుమతించకపోవడంతో అసలు లోపట ఏం జరుగుతుందో అనే విషయాలు సైతం బయటకు రావడం లేదు.. వస్తే అది ఎప్పుడూ అడపాదడపా రావడం అనేది జరుగుతుంది.. చెప్పుకుంటే సిగ్గు పోద్ది అన్న చందంగా చివరికి విద్యార్థులు తినే భోజనం సైతం అలాగే చివరికి ఐదు రూపాయలు విలువ చేసే ఒక కోడిగుడ్డులు సైతం హ్యాండ్ బ్యాగుల్లో తీసుకెళ్లిన బయటకు వచ్చిన ఘటనలు లేకపోలేదు.. కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే పిల్లల తల్లిదండ్రులు గాని చదువు విషయంలో గానీ ఇంకా ఏ విషయంలోనైనా గాని కనీసం ఒక మాట మాట్లాడినా కూడా ఏదో సాకుగా చూపి టీసీలు ఇస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తున్న ఘటనలు సంబంధిత అధికారులకు సైతం తెలిసిందే.. ఒక సమస్య తలెత్తితే ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి ఏ విధంగా విద్యార్థికి మనం చెప్పాలి అనేది లేదు కానీ ఇలా టీసీలు అంటూ బెదిరింపులకు గురి చేయడంతో దిక్కుతోచని స్థితిలో నిరుపేద విద్యార్థులు చదువుకొని సీటు సంపాదించుకున్న పరిస్థితుల్లో వారు చెప్పిందే వేదం పెట్టింది అన్న చందంగా కాలం వెళ్లదీస్తున్న పరిస్థితి ప్రభుత్వ విద్యా వసతిగృహాల్లో నెలకొంది.. చాలా వసతి గృహాల్లో చాలామంది విద్యార్థిని విద్యార్థులు సైతం మృతి చెందిన ఘటనలు లేకపోలేదు.. ఇట్టి సందర్భంలోనే గత సంవత్సరం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు పాలనయాత్రంగం అధికారులు అడపాదడపా తనిఖీలు చేస్తూ గాడిలో పెట్టే యత్నం చేసిన ఘటనలు లేకపోలేదు.. గమనించి మేము ఇవ్వడం , షోకాస్ నోటీసులు ఇవ్వడం వాటికి వివరణ ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది.. అసలు ప్రభుత్వం కోట్లాది రూపాయలు విద్యా వ్యవస్థ కోసం భవి భవిష్యత్తు పిల్లల ఉన్నతి కోసం ఖర్చు చేస్తుంటే ఇలా ప్రభుత్వ కలను కలలుగానే ఉంచేలా వ్యవస్థ తయారయిందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు... ఇంకొన్ని సందర్భాల్లో అయితే ఒక రాష్ట్రానికి ఇతర రాష్ట్రానికి సంబంధం లేకుండా ఏ విధంగా పోస్టుల రిక్రూట్మెంట్ చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి...  విద్యార్థుల ఉన్నతి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం ఇకనైనా విద్యార్థి సంఘాల నుండి తల్లిదండ్రుల నుండి వస్తున్న ఆరోపణలను ఏ విధంగా ఎదుర్కొని ఏ విధంగా కార్యాచరణ చేపడుతుందో వేచి చూడాల్సిందే...

Tags:

About The Author

Related Posts

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన