చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన
-ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ తుమ్మల
By Ram Reddy
On
పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ): పఠాన్ చేరు నియోజకవర్గంలోని అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శివాలయాన్ని శనివారం పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలలో దైవభక్తిని పెంపొందించేందుకు శివాలయం నిర్మించడం పట్ల నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సహకారంతో దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు గోపాల్, చంద్రశేఖర్, కొల్లూరి మల్లేష్, మల్లేష్, రాములు, జగదీష్, సీనియర్ నాయకులు, ఆలయ నిర్వాహకులు రామకృష్ణ శర్మ, తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
14 Jun 2025 22:12:24
అల్లు అర్జున్కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు
Comment List