మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 

దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈసారి మే 27న కేరళలో ప్రవేశించే అవకాశం ఉందని IMD తెలిపింది. దేశవ్యాప్తంగా జూలై 8 నాటికి ఈ రుతుపవనాలు వ్యాపించే అవకాశం ఉంది.
మధ్య మరియు పశ్చిమభారతంలో జూన్ 17న రుతుపవనాలు విస్తరించవచ్చని అంచనా. గతేడాది మే 29న, 2023లో మే 30న కేరళలో రుతుపవనాలు ప్రవేశించాయి.
ఈ ఏడాది ఎల్నినో ప్రభావం తగ్గి లానిన్యా ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 52% ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా. సెంట్రల్ ఇండియాలో సాధారణ కంటే ఎక్కువగా, ఉత్తరభారతంలో 40% ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంది. గతేడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు సగటున 18.2 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు   మే 27న కేర‌ళ‌కు నైరుతి రుతుప‌వ‌నాలు 
దిల్లీ: ఈ ఏడాది భారతదేశంలో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ముందే ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1న కేరళలో రుతుపవనాలు ప్రవేశిస్తాయి....
కోట మశమ్మ పండుగకు గుంజి బజారు హమాలీలకు  ఆర్థిక సహకారం చేసిన
జుట్టు పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేది ఏమిటో తెలుసా.....
పాకిస్తాన్‌లో పెట్రోల్ బంకులు క్లోజ్.. 
వంగూరి వాచకం -నవరత్నాలు
ఘనంగా ప్రారంభమైన బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు
అమ్మ ఎదురుచూపు