ఆపరేషన్ సిందూర్ లో పోమల్ గ్రామ యువకుల పాత్ర
నవా పేట్, లోకల్ గైడ్:–
భారతదేశం, పాకిస్తాన్పై ఆపరేషన్ సిందూర్ ద్వారా గట్టి ప్రతిస్పందన చూపింది. ఈ ఆపరేషన్లో తెలంగాణ రాష్ట్రం, నవాపేట్ జిల్లా పోమల్ గ్రామ సైనికులు కీలక పాత్ర పోషించారు. పహెల్గాం ఘాటుకాన్ దాడికి ప్రతీకారంగా నిర్వహించిన ఈ కార్యాచరణలో పాల్గొన్న యువకులు తమ గర్వాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు. సరిహద్దు విధుల్లో పోమల్ యువకులు రాజస్థాన్ సరిహద్దు (జైసల్మేర్): పి. విజయ్ కుమార్,జమ్ము సరిహద్దు (ఉధంపూర్, అఖ్నూర్): కె. రమేష్,కె. సురేష్,పంజాబ్ సరిహద్దు (పఠాన్కోట్, ఫిరోజ్పూర్) వి. లింగం కె. రవి,ఈ యువకులు సరిహద్దు ప్రాంతాల్లో తమ విధులను నిర్వర్తిస్తూ, ఆపరేషన్ సిందూర్లో భాగస్వామ్యం చేయడాన్ని తమ జీవితంలోని గొప్ప అవకాశంగా భావించారు.దేశ రక్షణకు తోడ్పడినందుకు గర్విస్తున్నామని వారు తెలిపారు. దేశసేవలో పోమల్ గ్రామం
నవాపేట్ జిల్లాలోని పోమల్ గ్రామం అనేక సైనికోద్యోగాలను అందించింది. ఈసారి ఆపరేషన్ సిందూర్ ద్వారా మళ్లీ ఆ గ్రామం దేశసేవకు దోహదపడింది. సైనికుల కుటుంబాలు, గ్రామస్థులు వారి విజయానికి ఆనందం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ తన సైన్య శక్తిని ప్రపంచానికి చాటింది. ఈ విజయంలో పోమల్ గ్రామ యువకుల త్యాగం, సేవా భావన అభినందనీయం అంటూ ప్రశంసించారు.
Comment List