సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ : లోకల్ గైడ్:
వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు నరేందర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఆపద్బంధుగా ఉపయోగపడుతుందని అన్నారు.నగర కాంగ్రెస్ కార్యాలయంలో గతంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధితో పాటు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తున్నామని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.సిఎంఆర్ఎఫ్ చెక్కులు పొందిన వారిలో మాచర్ల పద్మ,బాకారపు మాలతీ, చందా రేణుక,జయసుధ, జుబేదా బేగం,శామీన్ బేగం, తప్పట్ల నరేష్, వూకంటి ఆనంద్ రెడ్డి,గొడుగు మల్లయ్య తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో గుండాటి శ్రీనివాస్ రెడ్డి, ఖలీల్,షెహన్షా,లక్కీరెడ్డి కిరణ్ రెడ్డి, అనిల్, జూపాక సుదర్శన్,రాజకుమార్, మీరజ్,మాసూమ్ ఖాన్,నదీమ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List