జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయల విరాళం
By Ram Reddy
On
గద్వాల, లోకల్ గైడ్ :
జాతీయ రక్షణ నిధికి లక్ష రూపాయలను విరాళంగా అందజేసిన గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి ని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అభినందించారు. సోమవారం కలెక్టర్ ఐడీఓసీ సమావేశం హాల్ నందు వడ్డేపల్లి మండలం కోయిల్ దిన్నె గ్రామానికి చెందిన రైతు గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయులుగా, సమాజ సేవకు అంకితమై, అపారమైన దేశ భక్తిని ప్రదర్శించారు. రైతు భరోసా పథకం ద్వారా తన బ్యాంకు ఖాతాలో జమైన రూ. 1,00,000ను జాతీయ రక్షణ నిధికి విరాళంగా అందజేసి, దేశ రక్షణ కోసం నిరంతరం సాహసంగా సేవలందిస్తున్న భారత సాయుధ దళాల పట్ల తన గాఢమైన గౌరవాన్ని, సేవా భావాన్ని గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి ప్రదర్శించారు. సంక్షేమ పథకాల ప్రయోజనాన్ని ఇతరులకు చేరువ చేయడం గొప్ప ఉదాహరణ. లక్మీకాంతారెడ్డి సేవా స్పూర్తి అందరికీ ప్రేరణగా నిలవాలని అన్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
19 May 2025 17:42:04
కరీంనగర్ : లోకల్ గైడ్:వివిధ కారణాలతో అనారోగ్యానికి గురై ఆర్థికంగా ఇబ్బందులు ప డ్డవారిని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆదుకుంటున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి...
Comment List