గణంగా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి.
మహబూబాబాద్ (లోకల్ గైడ్) : కేసముద్రం సిపిఎం మండల పార్టీ కార్యాలయంలో దక్షిణ భారతదేశం లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతి సందర్భంగా, సిపిఎం, కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ కార్యదర్శి గోడిశాల .వెంకన్న మాట్లాడుతూ, భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పుచ్చలపల్లి సుందరరామి రెడ్డి అసమానతలు లేని వర్గ రహిత సమాజం కోసం, తన పేరు చివర ఉన్న రెడ్డి తొలగించుకు నీ సుందరయ్యగా సుప్రసిద్ధులు, అయ్యారు. యావదస్తిని వ్యవసాయ కార్మికులు దళితుల కోసం పంచి పెట్టినారు, భారతదేశ తొలి ప్రతిపక్ష నాయకుడిగా సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు, పిల్లలు ఉంటే స్వార్థం పెరుగుతుందని లీల సుందరయ్య ఆదర్శ దంపతులు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకొని దేశంలోని శ్రామిక అనగారిన వర్గాలే తమ పిల్లలుగా ప్రజాసేవకే జీవితం అంకితం చేసిన నిస్వార్ధ ఆదర్శ దంపతులు, వారి ఆశయాలు కొనసాగించడానికి ప్రతి ఒక్క పార్టీ సభ్యుడు కార్యకర్త కృషి చేయాలని అదే సుందరయ్య గారికి మనం ఇచ్చే నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బొబ్బల. యాకుబ్ రెడ్డి, చాగంటి కిషన్, మోడెం.వెంకటేశ్వర్లు, జల్లే జయరాజ్, నీరుటి. జలంధర్, సోమరపు. ఎల్లయ్య, ముద్రగోల సారయ్య, గూగులోత్. కేశ్యా తదితరులు పాల్గొన్నారు.
Comment List