రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి.

ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్.

రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలి.

నల్గొండ జిల్లా కేంద్రంలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి.

పార్టీ శ్రేణులతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శంకర్ నాయక్.


నల్గొండ జిల్లా ప్రతినిధి. ( లోకల్ గైడ్)


భారత మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్ గాంధీ వర్ధంతిని బుధవారం నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్యతో కలిసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను కొనియాడారు.పార్టీ శ్రేణులంతా రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం శ్రీధర్ బాబు రాజకీయ జీవితం: చిత్తశుద్ధి, ప్రజాసేవకు నిలువెత్తు రూపం
తెలంగాణలో ప్రజల మద్దతుతో మలమలలాడుతున్న రాజకీయ నాయకుల్లో ముఖ్యుడైన బండి శ్రీధర్ బాబు, రాజకీయాల పట్ల నిజమైన అంకితభావాన్ని కలిగిన నేతగా గుర్తింపు పొందారు. ఈయన ప్రస్తుత...
వీరోచిత త్యాగానికి ప్రతీక – అజయ్ అహుజా జీవితం దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం
మహబూబా ముఫ్తీ జీవితం: జమ్మూ కశ్మీర్ తొలి మహిళా సీఎం, రాజకీయ పోరాటానికి మరో పేరు
రాజా రామ్మోహన్ రాయ్ జయంతి: సమాజ సంస్కర్త జీవితాన్ని స్మరిస్తూ దేశవ్యాప్తంగా నివాళులు
అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025: ప్రకృతిని పరిరక్షిద్దాం, భవిష్యత్‌ను బలోపేతం చేసుకుందాం
తెలంగాణలో భారీ వర్షాలు – పిడుగుల హెచ్చరిక జారీ, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా వెనక్కి తగ్గిన 2021 ఆపరేషన్‌పై పెంటగాన్ సమగ్ర సమీక్ష