టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంపిక..
ఇంగ్లండ్ పర్యటనకు భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ
లోకల్ గైడ్ :
ఇంగ్లండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అందరి అంచనాలకూ తగ్గట్లే శుభ్మన్ గిల్ భారత 37వ టెస్టు కెప్టెన్గా నియమితులయ్యాడు. ముంబైలో నిర్వహించిన సీనియర్ సెలక్షన్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గిల్కు జోడీగా రిషభ్ పంత్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేశారు.ఇంగ్లండ్తో జూన్ 20న హెడింగ్లీలో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్కు 18 మందితో కూడిన జట్టును బీసీసీఐ ఈ సందర్భంగా ప్రకటించింది. జట్టులో గిల్, పంత్, యశశ్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్దీప్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్లు ఉన్నారు.ఈ నిర్ణయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బృందం తీసుకుంది.
Comment List