రూ.15 లక్షలతో పరార్ తమ్ముడింట్లో అక్క చోరీ

కేవలం ఐదు రోజుల్లో కేసు ఛేదించిన కొత్తూరు పోలీసులు

రూ.15 లక్షలతో పరార్ తమ్ముడింట్లో అక్క చోరీ

ముగ్గురు నిందితులను రిమాండ్ కు తరలింపు

లోకల్ గైడ్ కొత్తూరు.

తమ్ముడు ఇంట్లో నగదు ఉండడాన్ని తెలుసుకున్న సొంతఅక్క మరో ఇద్దరితో కలిసి రూ.15 లక్షలు దోచుకున్న సంఘటనను కొత్తూరు పోలీసులు ఐదు రోజుల్లోనే చేదించారు.ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకొని నగదు స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా సిఐ నరసింహారావు తెలిపిన వివరాలు ప్రకారం.. కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని స్టేషన్ తిమ్మాపూర్ లో నివాసముంటున్న కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు వన్నాడ శివశంకర్ గౌడ్ తన తల్లిదండ్రులు భూమి విక్రయించేందుకు అగ్రిమెంట్ చేయగా,కొంత డబ్బు వచ్చింది. ఇందులో కొంత అప్పుగా చెల్లించి మిగతా రూ.15 లక్షలను శివశంకర్ గౌడ్ తన ఇంట్లోని బీరువాలో దాచి పెట్టాడు. వారం రోజుల క్రితం శివశంకర్ తల్లిదండ్రులు తమ పెద్ద కూతురితో కలిసి లాంగ్ టూర్ కు వెళ్లగా, రూ.15 లక్షలను శివశంకర్కు అప్పగించారు. గత నెల 30న శివశంకర్ షాబాద్ లోని తన బంధువుల ఇంట్లో చావు డబ్బులను బీరువాలో పెట్టి, ఇంటికి తాళం వేసి వెళ్ళాడు. అదే రోజు సాయంత్రం తిరిగి ఇంటికి రాగా ఇంటి తాళం పగలగొట్టి బీరువాలోని డబ్బులు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు అందిన వెంటనే సీఐ నరసింహారావు కేసు నమోదు చేసి దర్యాప్తు కోసం రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. తన అక్కనే దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని శివకుమార్ అనుమాన వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. బుధవారం స్వప్నను కుమ్మరిగూడలో ఉన్న తన ఇంటి వద్ద అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా దొంగతనాన్ని ఒప్పుకుంది. స్వప్న తో పాటు మరో ఇద్దరు నిందితులు అశోక్,రఘు లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 లక్షల నగదు తో పాటు కారు,ఆటో, యాక్టివా,మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన స్వప్న,అశోక్, రఘు లను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరచి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును చేదించడంలో కృషి చేసిన సీఐ నరసింహారావు,ఎస్ఐ మురళి గౌడ్,ఎస్ఐ శ్రీనివాస్ చారి, కానిస్టేబుల్ కుమార్, రవికుమార్,హెచ్జి నరేష్ లను శంషాబాద్ డీసీపీ రాజేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News