ఇమ్ముల నర్వలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో
పాల్గొన్న మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి,మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్
ఆలయ పనులకు రూ.లక్ష 1,16,000/-మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి విరాళం
లోకల్ గైడ్, కొత్తూరు.
యాదవుల కుల దైవం మల్లన్న స్వామి అని మాజీ ఎంపీపీ పిన్నింటి మధుసూదన్ రెడ్డి అన్నారు.గురువారం కొత్తూరు మండలంలోని ఇమ్ముల నర్వలో యాదవ్ సంఘం ఆధ్వర్యంలో మల్లన్న స్వామి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి,మాజీ సర్పంచ్ అంబటి ప్రభాకర్ హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం ఆలయ పనులకు రూ.లక్ష 1,16,000/-మాజీ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి విరాళం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అజయ్ నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవికుమార్ గుప్తా,మాజీ ఉపసర్పంచ్ లు నరసింహారెడ్డి, శ్రీరాములు యాదవ్,దశరత్ నాయక్,ఇంద్రసేనారెడ్డి,గొడుగురవి,శేఖర్ ముదిరాజ్,సీసీ కెమెరా శేఖర్ ముదిరాజ్,బోకుల రాజు, దయానంద రెడ్డి,గోపాల్ నాయక్,జంగయ్య యాదవ్,రమేష్ యాదవ్,ఏబి శ్రీను యాదవ్, మహేష్ యాదవ్,గుర్రంపల్లి శ్రీశైలం యాదవ్,దానడి శేఖర్ యాదవ్,ఎన్ రాజు యాదవ్, ఎం కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comment List