కార్మికుడికి రావలసిన గ్రాడ్యుయేట్ డబ్బులు ఇప్పించిన

-శ్రమశక్తి అవార్డు గ్రహీత..రవి సింగ్

కార్మికుడికి రావలసిన గ్రాడ్యుయేట్ డబ్బులు ఇప్పించిన

కుత్బుల్లాపూర్, (లోకల్ గైడ్ ): దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గుండ్ల పోచంపల్లి ఇండస్ట్రీ ఏరియాలో "ఆర్ జె పి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్" కంపెనీలో వంశీ అనే కార్మికుడు గత ఐదు సంవత్సరాల నుండి పనిచేసేవారు, కొన్ని అనివార్య కారణాలవల్ల ఆర్ జె పి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మానేయడం జరిగింది. వంశీ అనే కార్మికుడికి గ్రాడ్యుయేట్ డబ్బులు 30,000/-వేల రూపాయలు రావాల్సి ఉండగా అవి ఇవ్వకపో వడంతో పలుమార్లు కంపెనీ యజమాన్యాన్ని ఎన్నిసార్లు అడిగినా వంశీ పట్ల నిర్లక్ష్యం వహిస్తూ తనను ఏదో రకంగా కంపెనీ యజమాన్యం పట్టించుకోవడం లేదు అని తెలుసుకొని అడిగి అడిగి విసుగు చెందిన కార్మికుడు వంశీ తనకు ఏం చేయాలో అర్థం కాక ఎవరైతే కార్మికులకు న్యాయం చేస్తారని తోటి కార్మిక మిత్రుల ద్వారా తెలుసుకొని, బిఆర్ టియు రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవి సింగ్ గురించి తెలుసుకొని తన ఆఫీస్ వద్దకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. వెంటనే స్పందించిన కార్మిక నాయకుడు రవి హుటాహుటిన కంపెనీ వద్దకు బయలుదేరి కంపెనీ యజమాన్యంతో పలుమార్లు చర్చించి కార్మికుడికి వంశి కి  రావలసిన గ్రాడ్యుయేట్ డబ్బులు 30,000/- వేల రూపాయలు ఇప్పించారు. ఈ సందర్భంగా కార్మికుడు వంశీ, మాట్లాడుతూ..నాకు న్యాయం చేసిన కార్మిక నాయకుడు రవి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, సుదర్శన్, జగన్, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News