బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం, ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు..?_బిఎస్పీ

బిఎస్పీ పార్టీ నాయకులపై అక్రమ కేసులు సహించం, ప్రజా పోరాటాలు చేస్తున్నందుకేనా అక్రమ కేసులు..?_బిఎస్పీ

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్
 ఈ రోజు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక దేవకీ ఫంక్షన్ హాల్ లో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ అధ్యక్షులు కళ్యాణ్, అసెంబ్లీ ఇంచార్జ్ కొత్తపల్లి కుమార్, జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్ లు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ మండలం, తూడుకుర్తి గ్రామంలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా బిఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ పృధ్వీరాజ్ పై అక్రమ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూన్నట్లు తెలిపారు. ఇలాంటి అక్రమ కేసులకు బిఎస్పీ పార్టీ అదరదు, బెదరదు అనీ స్పష్టం చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ ఎంఎల్ఏ ఎంజేఆర్ పై స్థానికంగా బిఎస్పీ పార్టీ వీరోచిత పోరాటం చేసిందని, ఆ చరిత్రను యాది మరువొద్దనీ అన్నారు. ప్రజా పోరాటాలు బిఎస్పీ పార్టీ చేస్తే, లాభం కాంగ్రెస్ పార్టీకి జరిగిందని ఎద్దేవా చేశారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ - బిఎస్పీ పార్టీకి రిటర్న్ గిఫ్ట్ యి విధంగా ఇస్తుందా అనీ ప్రశ్నించారు. బిఎస్పీ పార్టీ తిరిగి కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తే ఏ విధంగా ఉంటుందో కూడా చూడాలని సవాల్ విసిరారు. నాగర్ కర్నూల్ అసెంబ్లీలో మాజీ ఎంఎల్ఏలు శుభ, అశుభ కార్యాలకు పరిమితం ఐతే ప్రజా పోరాటాలు బిఎస్పీ పార్టీ మాత్రమే చేస్తున్నదనీ వివరించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తన కుటుంబానికి చెందిన మహిళాను కొడితే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా ఆయనపై ఎలాంటి చర్యలు పోలీసులు ఎందుకు తీసుకోలేదని నీలదీశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒక న్యాయం - బిఎస్పీ పార్టీ నాయకులకు మరో న్యాయమా అనీ దుయ్యబట్టారు. అక్రమ కేసులను అడ్డుపెట్టి బిఎస్పీ పార్టీ పోరాటాలను, ఉద్యమాన్ని ఆపలేరని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీ పార్టీ గెలుపే ధ్యేయంగా పని చేస్తున్నామని అన్నారు. ఇ అక్రమ కేసుల పరంపర ఆపకపోతే బహుజనుల ఆత్మ గౌరవ సభ చేపడుతామని హెచ్చరించారు. అట్లాగే రాష్ట్ర ఈసీ మెంబర్ పృధ్వీరాజ్ మాట్లాడుతూ మహిళను బూచిగా చూపి తన పైన అక్రమ కేసు నమోదు చేశారనీ, నాకు పడనీ వారు మహిళను తీసుకుని వచ్చి దొంగతనం కేసో, మర్డర్ కేసో పెడితే కూడా పోలీసులు ఎలాంటి ముందస్తు ఎంక్వైరీ లేకుండా కేసులు నమోదు చేస్తారా అనీ అడిగారు..? ఎవరి మాటలో పట్టుకుని నాపైన అక్రమ కేసు నమోదు చేయడం అంటే చట్టాలను అపహస్యం చేయడమే అన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకు ఇచ్చిన హామీల హామలు కోసం నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. తడిసిన ధాన్యం కొనమని, మున్సిపాలిటీ అవినీతి విషయంలో, పేదల డబ్బాల విషయంలో ముందుండి కొట్లాడుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కసి తీర్చుకుంటుందా అనీ విమర్శించారు. అట్లాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి ఐఏఎస్ అలుగు వర్షిణినీ ప్రభుత్వం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అలుగు వర్షిణి గారి ఆలోచన విధానాలు, సీఎం గారితో మాట్లాడి కరికులంగా మార్చాలని తెలిపారు. ఇలాంటి ఐఏఎస్ లు సాంఘిక సంక్షేమ గురుకులలాకు వొద్దు అనీ, బహుజన విద్యార్థుల బ్రతుకులు మార్చే ఐఏఎస్ లు కావాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇ కార్యక్రమంలో బిఎస్పీ అసెంబ్లీ కోశాధికారి భాస్కర్, తెల్కపల్లి మండల అధ్యక్షులు బాల నాగులు, నాయకులు గుంత భాస్కర్, రాంచందర్, నాగరాజు, బాలయ్య, వెంకటేష్ మరియు బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు సాయిబాబాలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

ఇవి ఉడకబెట్టి  తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా....... ఇవి ఉడకబెట్టి తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా.......
పండుగలు లేదా శుభ కార్యాల సమయంలో చాలా మంది ప్రత్యేకంగా గారెలు తయారుచేస్తుంటారు. మొక్కజొన్న, బొబ్బర్లు, పెసలు, మినుములు వంటివి ఉపయోగించి గారెలను వేస్తారు. కొన్ని ప్రాంతాల్లో...
పదవి విరమణ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది 
బీజేపీ నాయకుల ర్యాలీ 
పొగాకు కు దూరంగా ఉండండి-ఆరోగ్యంగా జీవించండి 
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను చేయాలి 
వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
జూన్ రెండో వారం నుంచి విస్తారంగా వ‌ర్షాలు........