ఫస్ట్ టీ20లో విండీస్పై నెగ్గిన ఇంగ్లండ్
వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ అద్భుత విజయం సాధించింది. మూడు వన్డేలు గెలిచిన ఊపులో తొలి టీ20లోనూ విజృంభించింది. 21 పరుగుల తేడాతో విండీస్ను చిత్తుచేసి సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. కెప్టెన్ జోస్ బట్లర్ ధమాకా ఇన్నింగ్స్ ఆడుతూ 96 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లో 6 బౌండరీలు, 4 సిక్సర్లు ఉన్నాయి. తృటిలో శతకం చేజారినా, జట్టుకు మంచి స్కోరు అందించాడు.189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు 167 పరుగులకే పరిమితమైంది. విండీస్ టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో మ్యాచ్పై పట్టు కోల్పోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్ స్పిన్నర్ లియామ్ డాసన్ ధాటిగా బౌలింగ్ చేస్తూ నాలుగు కీలక వికెట్లు తీశాడు. మూడేళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన డాసన్, తన ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.విండీస్ బౌలింగ్ దళంలో ప్రధానంగా పేరున్న అకీల్ హుస్సేన్ ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. వీసా సమస్యల కారణంగా అతను బ్రిటన్ చేరకపోవడంతో జట్టులో ఉండలేదు. ఇది విండీస్కు కొంత నష్టంగా మారింది.
Comment List