వికాస తరంగిణి సభ్యులకు యోగా పై అవగాహన.....
తొర్రూరు (లోకల్ గైడ్) తొర్రూర్ మండలం లోని స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల తొర్రూర్ సీనియర్ వైద్యాధికారి డాక్టర్ పి కిరణ్ కుమార్ సారధ్యంలో యోగా శిక్షకులు మురళీకృష్ణ లు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బుధవారం నిర్దేశించిన కార్యక్రమాల ప్రణాళికలో భాగంగా బుధవారం ఉదయం వికాస తరంగిని సభ్యులకు అవగాహన కల్పిస్తూ నేర్పించి వారితో చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి కిరణ్ కుమార్ తో బాటు యోగా శిక్షకులు మురళీకృష్ణ 35 రకాల ఆసనాలను నేర్పారు విశిష్టతను తెలుపుతూ శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో రోగాలు ఒక భాగంగా చేసుకొని అలవారించుకోవాలని ప్రాణాయామం వజ్రాసనం లాంటి ఆసనాలు మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి యోగ ఆసనాలు దోహాదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి తోరూర్ కోఆర్డినేటర్ గీతారెడ్డి, డాక్టర్ కె యాదగిరి రెడ్డి సత్యనారాయణ నాళ్ల కృష్ణమూర్తి,ఇమ్మడి రాంబాబు,డాక్టర్ రామారావు ఉపేందర్ రావు, ప్రసూన ,రేణుక ,శ్రీదేవి, అనురాధ ,శశికళ , జమున, తదితరులు పాల్గొన్నారు.
Comment List