రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

 వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ 

రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్: మంగళవారం వికారాబాద్ మండల,మున్సిపల్ పరిధిలోని ఎర్రవల్లి ,ఆలంపల్లి లలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  భూ భారతి చట్టం ద్వారా రైతులకు కావాల్సిన సేవలను అందించాలని కలెక్టర్ సూచించారు.  సాదా బైనామా, పిఓపి, భూ విస్తీర్ణం లో మార్పులు, చేర్పులు, పాసు పుస్తకాల అందజేత తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల పరిష్కార దిశగా రెవెన్యూ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సాధించాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల నమోదు రిజిస్టర్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం పెండ్లిమడుగు గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారు ఇండ్ల నిర్మాణాలు చేపట్టుకోవాలని కలెక్టర్ సూచించారు.  సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులతో జిల్లా కలెక్టర్  మాట్లాడి చెల్లింపులపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ తో పాటు అదనపు జిల్లా కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డిఓ వాసు చంద్ర , తహసిల్దార్ లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు! సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు!
లోక‌ల్ గైడ్: సంక్రాంతి పండుగకు టాలీవుడ్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ వసూళ్లు రాబట్టే...
ఎన్డీఏ పాలన పేదల సంక్షేమానికే – ప్రధాని మోదీ
మొటిమలు వచ్చే వారు అశాంతి పడకండి – ఇంట్లోనే సహజ పరిష్కారాలు!
ఉదయం టీ, కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి అదనపు బోనస్!
సమస్యల పరిష్కారం కొరకే భూభారతి చట్టం
ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 21వ తేదీతో గడువు ముగింపు
మాటలు రావడం లేదు" – తొక్కిసలాట విషాదంపై విరాట్ కోహ్లీ స్పందన