ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!

ఉప్పల్‌లో భారత్‌, న్యూజిలాండ్‌ టీ20 మ్యాచు!

లోక‌ల్ గైడ్: హైదరాబాద్‌ క్రికెట్‌ అభిమానులకు గుడ్‌ న్యూస్! నగరంలోని ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం మరోసారి ఉత్సాహభరిత ధనాధన్‌ మ్యాచ్‌కు వేదిక కానుంది. వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు వస్తున్న న్యూజిలాండ్‌ జట్టుతో టీమ్‌ఇండియా ఇక్కడ ఒక టీ20 మ్యాచ్‌ ఆడనుంది.మొత్తంగా కివీస్‌ జట్టు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు జైపూర్‌, మొహాలి, ఇండోర్‌, రాజ్‌కోట్‌, గువహతి, త్రివేండ్రం, నాగ్‌పూర్‌ వేదికలను ఎంపిక చేసినట్టు సమాచారం. శనివారం జరుగబోయే బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం అనంతరం పూర్తి షెడ్యూల్‌ అధికారికంగా విడుదల కానుంది.
గతంలో ఉప్పల్‌ వేదికగా భారత్‌ చివరిసారిగా గత అక్టోబర్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఆడగా, ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పొట్టి క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు (297/6) ను సృష్టించింది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన