నేడు ధరూర్ కు రానున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
By Ram Reddy
On

లోకల్ గైడ్ : ధరూర్ మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఏర్పాటు చేసిన భూ భారతి చట్టం - 2025 అవగాహన సదస్సుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8:05 గంటలకు బేగంపేట, హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 8:50 గంటలకు గద్వాల ఐడిఓసి పి జె పి క్యాంపు వద్దగల హెలిప్యాడ్ కు చేరుకుంటారని తెలిపారు. అధికారులతో కలిసిన అనంతరం రోడ్డు మార్గాన అక్కడి నుండి బయలుదేరి ఉదయం 9:15 గంటలకు ధరూర్ తహసిల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం 11 గంటలకు బయలుదేరి నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News

18 May 2025 09:01:19
లోకల్ గైడ్ తెలంగాణ, జిల్లేడు చౌదరిగూడెం: జిల్లేడు చౌదరిగూడెం మండల మాజీ ఎంపిపి సన్వవల్లి యదమ్మ తనయుడు ఆంజనేయులు గుర్రంపల్లి గ్రామ( జిల్లెల్ల గడ్డ) రైతుల ఇబ్బందులను...
Comment List