దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది

దళారులను నమ్మి మోసపోవద్దు

వర్ధన్నపేట మార్కెట్, పిఎసిఎస్  చైర్మన్ వెంకటయ్య, రాజేష్ ఖన్నా 

లోకల్ గైడ్ తెలంగాణ: వర్దన్నపేట మండలం లోని ల్యాబర్తి, వెంకట్రావుపల్లి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యాసంగి వరి దాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం రోజున వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పిఎసిఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా తో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధరతో పాటు, సన్నాలకు బోనస్ కూడా పొందాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటుచేయబడిన ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో క్వింటాలుకు దొడ్డు రకం ధాన్యానికి రూ 2300,   సన్న రకం ధాన్యాన్ని రూ 2320  కు కొనుగోలు చేయడంతో పాటు సన్నాలకు  క్వింటాలుకు రూ 500/- బోనస్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని రైతులకు తెలిపారు. రైతులెవ్వరు మధ్యదళారులకు అమ్ముకోని మోసపోవద్దు. ఐకెపి కొనుగోలు కేంద్రాల్లోనే  రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు.ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తేమశాతం 17% ఉండే విధంగా చూడాలని, అలాగే 41 కేజీలతో మాత్రమే రైతుల నుంచి  ఐకెపి కొనుగోలు దారులు కాంటాలు నిర్వహించాలని సూచించారు. 41 కేజీల కంటే  అధిక తూకంతో  కాంటాలు నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రైతులు ధాన్యం విక్రయించిన అనంతరం వాటిని తడవకుండా చూసుకునే బాధ్యత ఐకెపి కొనుగోలుదారులదేనని వారు అన్నారు. అదేవిధంగా ఖరీదు చేయబడిన ధాన్యాన్ని ఐకెపి కేంద్రాలు ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి గోదాములకు తరలించాలని సూచించారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల వద్ద మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.రాష్ట్రంలోని 43  లక్షల మంది రైతులకు 22 వేల కోట్ల రూపాయలతో  2 లక్షల రూపాయల వరకు రైతు రుణమాఫీని చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు.  రాష్ట్రంలో ఉన్న 90 లక్షల తెల్ల రేషన్ కార్డు కుటుంబాలకు చౌక ధరల దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై మూడు వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. అయినను పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయడం  రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డి,మాజీ జడ్పీటీసీ కమ్మగోని ప్రభాకర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రతి బాను ప్రసాద్,జిల్లా నాయకులు మహేందర్ రెడ్డి,ఎండీ వలి పాషా,యూత్ నాయకులు ప్రశాంత్, అడ్డగట్టా రాములు,మహిళా నాయకురాలు బండ సరిత, రైతులు తదితరులుపాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు! యాప్‌లో ప్రకటన ఇచ్చి… ఆన్‌లైన్‌లో మోసానికి బలయ్యాడు!
లోకల్ గైడ్: క్విక్కర్‌ యాప్‌లో ఇల్లు అద్దెకివ్వబడునంటూ ప్రకటన ఇచ్చారు. యాడ్‌ చూసి సైబర్‌ నేరగాడు సంప్రదిస్తే అతని మాటలు నమ్మి రివర్స్‌ డబ్బులు పంపించి అడ్డంగా...
అద్భుతమైన క్యాచ్ పట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డర్‌
‘రాధే శ్యామ్’ ద‌ర్శ‌కుడి దర్శకత్వంలో వ‌రుణ్ తేజ్ కొత్త చిత్రం
అంబేద్కర్ ఆశాల సాధనలో
గడపగడపకు జై బాబు, జై భీమ్, జై సంవిదాన్ నినాదం
నూతన భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు పరిష్కారం
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు