పెరిగిన మెట్రో చార్జీలు 10 శాతం త‌గ్గింపు.....

పెరిగిన మెట్రో చార్జీలు 10 శాతం త‌గ్గింపు.....

లోక‌ల్ గైడ్ : ఇటీవల పెరిగిన మెట్రో చార్జీలను రద్దు చేయాలంటూ ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.  దీంతో స్పందించిన ఎల్ అండ్ టీ, ప్రయాణికుల భారం తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీ మే 24వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.ఇది వరకూ కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కి, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కి పెరిగిన సంగతి విదితమే. ఈ పెరిగిన చార్జీలు మే 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఛార్జీల పెంపుతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఇప్పుడు అమల్లో ఉన్న మెట్రో టికెట్‌ ధరలు ఇలా ఉన్నాయి:

మొదటి 2 కి.మీ. వరకు – రూ. 12

2 నుండి 4 కి.మీ. వరకు – రూ. 18

4 నుండి 6 కి.మీ. వరకు – రూ. 30

6 నుండి 9 కి.మీ. వరకు – రూ. 40

9 నుండి 12 కి.మీ. వరకు – రూ. 50

12 నుండి 15 కి.మీ. వరకు – రూ. 55

15 నుండి 18 కి.మీ. వరకు – రూ. 60

18 నుండి 21 కి.మీ. వరకు – రూ. 66

21 నుండి 24 కి.మీ. వరకు – రూ. 70

24 కి.మీ. పైగా – రూ. 75

ఈ నిర్ణయంతో ప్రయాణికులపై ఉన్న ఆర్థిక భారం కొంతమేర తగ్గే అవకాశం ఉంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 "మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌..... "మైసూర్ పాక్  కాదు మైసూర్ శ్రీ‌.....
పహల్గాం దాడి అనంతరం పాక్‌పై వ్యతిరేకత నేపథ్యంలో, జైపూర్‌లోని 'త్యోహార్ స్వీట్స్' యజమాని అంజలీ జైన్ దేశభక్తి ప్రేరణతో ‘మైసూర్ పాక్’ లాంటి స్వీట్లలోని 'పాక్' పదాన్ని...
హృతిక్, ఎన్టీఆర్ వంటి స్టార్స్‌తో కలిసి పనిచేసిన అనుభవం మరచిపోలేనిది: అయాన్
భూసేకరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్
 ఎఫ్సీఐ (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కన్సల్టేటివ్ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఎంపీ డీకే అరుణ‌
మ‌హిళ‌ల హ‌క్కుల్లో ప్ర‌సూతి సెల‌వులు కీల‌కం!
ఆపరేషన్ సిందూర్ ఉగ్రవాదానికి గట్టి కౌంటర్‌గా నిలిచింది:  కేంద్ర హోం మంత్రి అమిత్ షా
రేప‌టి నుంచి  హైదరాబాద్ మెట్రో ఛార్జీల త‌గ్గింపు...