ఎన్డీఏ పాలన పేదల సంక్షేమానికే – ప్రధాని మోదీ

ఎన్డీఏ పాలన పేదల సంక్షేమానికే – ప్రధాని మోదీ

పేదల సంక్షేమమే తమ ప్రభుత్వానికి ముఖ్యలక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఎన్డీఏ గత పదేళ్ల పాలనలో పేదరికాన్ని నిర్మూలించేందుకు, ప్రజల జీవితాల్లో స్వయంసమృద్ధిని సాధించేందుకు అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని చెప్పారు.“ప్రతీ ఒక్కరూ గౌరవంగా జీవించగలిగే సమ్మిళిత, స్వయం సమృద్ధ భారతదేశాన్ని రూపొందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది,” అని మోదీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు – పీఎం ఆవాస్ యోజన, పీఎం ఉజ్వల యోజన, జనధన్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి వాటి ద్వారా ప్రజలకు ఇళ్లు, శుద్ధమైన ఇంధనం, బ్యాంకింగ్ సేవలు, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు అందించగలిగామని పేర్కొన్నారు.“ఈ పథకాల ద్వారా 25 కోట్ల మందికిపైగా పేదరికం నుంచి బయటపడగలిగారు,” అని మోదీ చెప్పారు.

ఈ సందర్భంగా మోదీ సర్కార్ 3.0 ఏర్పడిన రోజు అయిన జూన్ 9 నాటికి ప్రస్తుతం ఆయన పదవిలో కొనసాగుతున్న 11 ఏళ్ల సేవ పూర్తవుతుందని తెలిపారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులకు సూచించారు. “ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధన కోసం ఉత్సాహంగా పని చేయాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News