ప్రతి గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలి  

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

గద్వాల, లోకల్ గైడ్:
ప్రతి గ్రామంలో బడి, గుడి తప్పనిసరిగా ఉండాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.గురువారం గద్వాల మండలం లత్తిపురం గ్రామంలో బండల శ్రీ సోమేశ్వర స్వామి, శ్రీ చౌడేశ్వరి దేవి దేవాలయం ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి అయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను గ్రామస్తులు, నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే  మాట్లాడుతూ దేవాలయాలు ఉండడం వల్ల ప్రజలలో భక్తి పెరుగుతుందన్నారు. దేవుని  పూజించడం వల్ల శాంతి నెలకొల్ప బడుతుందన్నారు. గ్రామంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని, దేవాలయ అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడుతున్నారో అదేవిధంగా గ్రామ అభివృద్ధికి  ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి ఐక్యతతో  ఆ దైవ అనుగ్రహంతో  గ్రామం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నానని తెలిపారు. రైతులు, పాడి పరిశ్రమ పరంగా అన్ని రంగాలలో గ్రామం అభివృద్ధి చెందాలన్నారు.  ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోవడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, మాజీ జడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ రమేష్ నాయుడు, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు సత్య రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, చంద్రశేఖర్, రాజా రెడ్డి , నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News