పచ్చదనం కోసం ప్రతి అడుగు,

ప్రకృతికి మారు పేరు చెట్టు,

పచ్చదనం కోసం ప్రతి అడుగు,

పర్యావరణ పరిరక్షణలో ప్రజల పాత్ర అనివార్యం మొక్కలు నాటడం, పెంచడం జీవిత చర్యల్లో భాగం చేయాలి, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్

లోకల్ గైడ్
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ పురపాలక సంఘం, కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధ్యక్షతన, ఒక మార్పు - అభివృద్ధికి మలుపు - స్వచ్చత పై తొలి అడుగు అనే నినాదంతో గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ ను అరికట్టాలన్న ప్రధాన థీమ్ తో నాగర్ కర్నూల్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఒక మార్పు - అభివృద్ధికి మలుపు - స్వచ్చత పై తొలి అడుగు ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ……… నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నమని,చెట్లు నీడ ఇవ్వడంతో పాటు ఆక్సిజన్ అందిస్తాయని అన్నారు. చెట్లను పెంచడం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ లో వచ్చే తరం ఆక్సిజన్ పెట్టుకునే స్థాయికి వస్తుందని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని అన్నారు. చెట్టు నీడతోపాటు ప్రకృతి సహజమైన ఆక్సిజన్ ను అందిస్తుందని,చెట్టు నీడ వెలకట్టలేనిదని చెట్లు ప్రగతికి మెట్లని  ప్రతి ఒక్కరూ చెట్టు ను నాటి సమాజంలో మార్పు తీసుకురావాలని అన్నారు. కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ ఒకేసారి వినియోగించే ప్లాస్టిక్ ను వాడే బదులు జూట్ బ్యాగులను వాడాలన్నారు.  ప్లాస్టిక్ భూతాన్ని తరిమి వేసినప్పుడే అందరూ ఆరోగ్యంగా ఉంటారని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్లాస్టిక్ వినియోగం పై ప్రజలందరూ అవగాహన కల్పించుకొని క్రమక్రమంగా వాడకం తగ్గించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గుడ్డ సంచులు జ్యూట్ సంచుల వాడకంతో పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని స్పష్టం చేశారు.ర్యాలీకి హాజరైన మహిళలకు జ్యూట్ సంచులను కలెక్టర్ బహుకరించారు.  అధిక సంఖ్యలో మహిళలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణకు 100,రోజుల ప్రణాళికను పకడ్బందీగా  అమలు చేసి పట్టణంలో మొక్కల పెంపకం తో పాటు ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రకృతి కి మారు పేరుగా ఉండాలంటే ఇక్కడ మనం చెట్లు నాడాలని,కాలుష్య నివారణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నరేష్ బాబు, పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ అధికారి దివ్య, మెప్మా మేనేజర్ సోఫియా, వివిధ శాఖల అధికారులు స్వయం సహాయక మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News