శేరిలింగంపల్లి పరిధిలో ఎక్సైజ్ ఆధ్వర్యంలో భారీగా డిఫెన్స్, విదేశీ  మందు పట్టివేత...

శేరిలింగంపల్లి పరిధిలో ఎక్సైజ్ ఆధ్వర్యంలో భారీగా డిఫెన్స్, విదేశీ  మందు పట్టివేత...

లోకల్ గైడ్ శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి పరిధిలోనీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ వారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు   శుక్రవారం నాడు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో మాతృశ్రీ నగర్లో   తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానం వచ్చిన వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా భారీగా డిఫెన్స్ మద్యంతో పాటు విదేశీ మద్యం పట్టుబడింది. ఈ మేరకు శేర్లింగంపల్లి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రంగారెడ్డి జిల్లా మరియు ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్. కిషన్ ఈ కేసు కు సంబంధించిన వివరాలను వెల్లడించారు. M.గాంధీ(65) తండ్రి వీరయ్య స్థానికంగా మాతృశ్రీ నగర్ లో నివాసం ఉంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలని దురాలోచనతో విదేశీ మద్యం తో పాటు డిఫెన్స్ మద్యం స్థానికులకు అమ్ముతుంటాడని ఆయన తెలిపారు.   ఆ నిందితుని  అదుపులోకి తీసుకొని మరింత లోతుగా విచారణ మొదలుపెట్టారు. పలు కోణాలలో ఎక్సైజ్ పోలీసులు ఆ నిందితుడిని విచారిస్తున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News