పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.
పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి.
శివారెడ్డి పల్లి లో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే
లోకల్ గైడ్, పరిగి.
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన (నియోజకవర్గంలో మొట్టమొదటిది) ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రభుత్వానికి,ఎమ్మెల్యే టి.రామోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను,ఇతర హామీలను నెరవేరుస్తుందన్నారు.నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు.66 గజాల స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలాల మండల పార్టీ అధ్యక్షులు,అధికారులు,ప్రజాప్రతిని ధులు,మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comment List