పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి.

పేదవారి ఇంటి కలను నెరవేర్చడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యం.

శివారెడ్డి పల్లి లో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే

లోకల్ గైడ్, పరిగి.

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం దోమ మండల పరిధిలోని శివారెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన (నియోజకవర్గంలో మొట్టమొదటిది) ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ పూజా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  పరిగి ఎమ్మెల్యే & డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి  హాజరయ్యారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రభుత్వానికి,ఎమ్మెల్యే టి.రామోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి  మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని,కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను,ఇతర హామీలను నెరవేరుస్తుందన్నారు.నిరుపేదలకు సొంతింటి కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు.66 గజాల స్థలం ఉన్న పేదలకు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలాల మండల పార్టీ అధ్యక్షులు,అధికారులు,ప్రజాప్రతిని ధులు,మండల కాంగ్రెస్ ముఖ్య నాయకులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు! సంక్రాంతి బరిలోకి టాలీవుడ్ స్టార్ హీరోలు – భారీగా రెడీ అవుతున్న చిత్రాలు!
లోక‌ల్ గైడ్: సంక్రాంతి పండుగకు టాలీవుడ్‌లో ఉన్న ప్రత్యేకమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పండుగ సందర్భంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి భారీ వసూళ్లు రాబట్టే...
ఎన్డీఏ పాలన పేదల సంక్షేమానికే – ప్రధాని మోదీ
మొటిమలు వచ్చే వారు అశాంతి పడకండి – ఇంట్లోనే సహజ పరిష్కారాలు!
ఉదయం టీ, కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగండి – ఆరోగ్యానికి అదనపు బోనస్!
సమస్యల పరిష్కారం కొరకే భూభారతి చట్టం
ఆర్టీసీ ఐటీఐ కాలేజీల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 21వ తేదీతో గడువు ముగింపు
మాటలు రావడం లేదు" – తొక్కిసలాట విషాదంపై విరాట్ కోహ్లీ స్పందన