పోగుల శ్రీనివాస్ రాజకీయ నిబద్ధత కార్యకర్తలకు స్ఫూర్తిదాయకo
నల్లు సుధాకర్ రెడ్డి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు
మహబూబాబాద్ జిల్లా (లోకల్ గైడ్)
పోగుల శ్రీనివాస్ క్రమశిక్షణ, అంకిత భావం, తన రాజకీయ నిబద్ధత కార్యకర్తలకు స్ఫూర్తిదాయకమని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి అన్నారు సిపిఐ కురవి మండల సమితి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఇటీవల అనారోగ్యంతో చనిపోయిన పోగుల శ్రీనువాస్ సంతాప సమావేశo జరగగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా విద్యార్థి యువజన రంగాలలో పనిచేసి పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా అనేక ఉద్యమాలలో యాశీలకంగా పాల్గొని డోర్నకల్ నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీ విస్తరణకు తన వంతు పాత్ర పోషించాడని , వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందనీ అన్నారు ఈనెల 15న రాజోలు గ్రామంలో సంతాప సభ నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూణంనేని సాంబశివరావు హాజరవుతారని అన్నారు.ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కరణం రాజన్న, బుర్ర సమ్మయ్య, బుడమ వెంకన్న,తురక రమేష్ ,దూది కట్ల సారయ్య, బొల్లం ఉప్పలయ్య, కలగూర నాగరాజు నిలిగొండ నాగేశ్వరరావు, బండారి రమేష్ తది తరులు పాల్గొన్నారు
Comment List