హైదరాబాద్ వాసులకు శుభవార్త!

హైదరాబాద్ వాసులకు శుభవార్త!

హైదరాబాద్ వాసులకు శుభవార్త! నగరంలో పాదచారుల భద్రతను పెంచడాన్ని లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా, కొత్తగా 86 ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (FOBs) నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అదేకాకుండా, 500 కొత్త బస్ షెల్టర్ల నిర్మాణం కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతంలో ఉన్న 23 FOBలను ప్రకటనల కోసం వినియోగించి ఆదాయం పొందాలని GHMC యోచిస్తోంది.ఈ చర్యలు నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించి, పాదచారులకు మరింత భద్రత కల్పిస్తాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ వేగంగా విశ్వనగరంగా ఎదుగుతున్న కొద్దీ, ట్రాఫిక్ రద్దీ ప్రధాన సవాలుగా మారుతోంది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొత్త అండర్‌పాసులు, విస్తృత రహదారులు, ప్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టింది. రద్దీ సమయంలో రోడ్లు దాటడం కష్టంగా మారిన నేపథ్యంలో, GHMC తీసుకుంటున్న ఈ చర్యలు నగర ప్రజలకు ఎంతో ఉపయోగపడనున్నాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం