సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్...
భారత యువ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలోకి అవకాశం లభించకపోవడంతో ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతడు నిర్ణయించాడు. ఇందులో భాగంగా ఇంగ్లాండ్లో కౌంటీ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాడు.అద్భుతంగా క్రికెట్ చరిత్రలో నిలిచిన లెజెండరీ బ్యాట్స్మన్ సచిన్ టెండూల్కర్ 1992లో ప్రాతినిధ్యం వహించిన యార్క్షైర్ జట్టుతో రుతురాజ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే నెలలో యార్క్షైర్కు చేరే రుతురాజ్, కౌంటీ ఛాంపియన్షిప్ మరియు మెట్రో బ్యాంక్ వన్డే కప్ ముగిసే వరకూ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.ఇది రుతురాజ్ గైక్వాడ్కు తొలి కౌంటీ సీజన్ కావడం విశేషం. అంతేకాదు, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన క్రికెటర్లలో కౌంటీల్లో అడుగుపెడుతున్న తొలి ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర సృష్టించనున్నాడు.1992లో యార్క్షైర్ తరఫున సచిన్ టెండూల్కర్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 46.52 సగటుతో 1070 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జట్టులో రుతురాజ్ ప్రాతినిధ్యం వహించబోతుండటం తనకు మరింత ప్రేరణగా మారుతుందని అంచనా.జాతీయ జట్టులోకి తిరిగే లక్ష్యంతో, కౌంటీ లీగ్ను ఒక ముఖ్యమైన మెట్టిలా భావిస్తున్న రుతురాజ్కి ఇది ఎంతో కీలకమైన అవకాశమవుతుంది.
Comment List