సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్...

సచిన్ బాటలో రుతురాజ్ గైక్వాడ్...

భారత యువ బ్యాటర్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించేందుకు కృషి చేస్తున్నాడు. ప్రస్తుతం టీమిండియాలోకి అవకాశం లభించకపోవడంతో ఖాళీగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అతడు నిర్ణయించాడు. ఇందులో భాగంగా ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడాలని డిసైడ్ అయ్యాడు.అద్భుతంగా క్రికెట్ చరిత్రలో నిలిచిన లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ 1992లో ప్రాతినిధ్యం వహించిన యార్క్‌షైర్ జట్టుతో రుతురాజ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. వచ్చే నెలలో యార్క్‌షైర్‌కు చేరే రుతురాజ్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌ మరియు మెట్రో బ్యాంక్ వన్డే కప్‌ ముగిసే వరకూ జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.ఇది రుతురాజ్ గైక్వాడ్‌కు తొలి కౌంటీ సీజన్ కావడం విశేషం. అంతేకాదు, మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన క్రికెటర్లలో కౌంటీల్లో అడుగుపెడుతున్న తొలి ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర సృష్టించనున్నాడు.1992లో యార్క్‌షైర్ తరఫున సచిన్ టెండూల్కర్ 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 46.52 సగటుతో 1070 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జట్టులో రుతురాజ్ ప్రాతినిధ్యం వహించబోతుండటం తనకు మరింత ప్రేరణగా మారుతుందని అంచనా.జాతీయ జట్టులోకి తిరిగే లక్ష్యంతో, కౌంటీ లీగ్‌ను ఒక ముఖ్యమైన మెట్టిలా భావిస్తున్న రుతురాజ్‌కి ఇది ఎంతో కీలకమైన అవకాశమవుతుంది.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం