బీజేపీ ప్రభుత్వంలో అవినీతి రహిత పాలన
- మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు.
గద్వాల, లోకల్ గైడ్ :
బీజేపీ ప్రభుత్వం 11ఏళ్ల పాలనలో ఎలాంటి అవినీతి జరగకుండా అవినీతి రహిత పాలన అందిస్తూ దేశాభివృద్ధికి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తోందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ రామచంద్ర రావు మాట్లాడుతూ.. 2004నుంచి 2014 వరకు దేశంలో స్కామ్ లు పెద్ద ఎత్తున జరిగాయన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదని అన్నారు. అమృత్ పథకంలో భాగంగా అనేక కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్నారని, చిరు వ్యాపారులు దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్థంభమని, వారిని బలంగా నిలబెట్టేందుకే బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు 99శాతం రోడ్డు పనులు జరగాయని సబ్కా సాత్, సబ్కా వికాస్ విధానంతో బిజెపి పని చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు దేశం, రాష్ట్రంలో మోదీ ప్రభుత్వం కోరుతున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ , భారతీయ జనౌషధి , ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకాలన్నీ దేశ ప్రజల ఆశలను నెరవేర్చాయన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ఆశీర్వాదాలు సమిష్టి భాగస్వామ్యంతో, భారతదేశం విభిన్న రంగాలలో వేగవంతమైన మార్పులను చూసిందన్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, కిసాన్ ఫసల్ బీమా వంటి కీలక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజ నేయులు, బిజెపి జిల్లా ఇంచార్జి డికె స్నిగ్దా రెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, మాజీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి, జిల్లా కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎం ఎస్ రెడ్డి, గద్వాల పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివా రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దేవాదాస్ తదితరులు ఉన్నారు.
Comment List