ఆ సినిమాలో ముగ్గురు భామలు
By Ram Reddy
On
దర్శకుడు లోకేశ్ కనగరాజ్ సృష్టించిన సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ "బెంజ్" ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. లోకేశ్ కథకు రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తుండగా, దర్శకత్వ బాధ్యతలు బక్కియరాజ్ కన్నన్ చేపట్టారు. మలయాళ నటుడు నివిన్ పౌలీ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.కథలో ముగ్గురు కథానాయికలకు అవకాశం ఉండటంతో, ముఖ్య పాత్రల కోసం సంయుక్తా మేనన్, ప్రియాంక అరుల్ మోహన్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక మరో కీలక పాత్ర కోసం మడోన్నా సెబాస్టియన్ను తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ‘లియో’లో విజయ్ సోదరిగా నటించగా, అదే పాత్రను ఇప్పుడు ఈ చిత్రంలోనూ కొనసాగించనున్నారని సమాచారం.ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. "బెంజ్" వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
12 Jun 2025 17:39:25
మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
Comment List