మెడికల్ కాలేజ్ హాస్టల్పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
By Ram Reddy
On
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం 1:39 గంటల సమయంలో లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది, 242 మంది ప్రయాణికులు ఉన్నారు.అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్కు సమీపంలోని బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై ఈ విమానం కూలింది. ఈ ప్రమాదంతో హాస్టల్ భవనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాద తీవ్రతపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags:
About The Author
Related Posts
Post Comment
Latest News
13 Jun 2025 18:33:55
స్వాగతం పలికిన అదనపు కలెక్టర్లు, అధికారులు..
Comment List