*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

భారీ వర్షంలో తడుస్తూనే పరిస్థితి సమీక్షిస్తూ ట్రాఫిక్ ను నియంత్రించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

 మిడ్జిల్ (లోకల్ గైడ్):
 జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా వరద నీరు చేరింది. ఈ కారణంగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న వెంటనే జడ్చర్ల శాసనసభ్యులు శ్రీ అనిరుధ్ రెడ్డి  తక్షణమే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, వరద నీటిని రహదారికి పక్కకు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అంతేకాక, ట్రాఫిక్ నియంత్రణలో స్వయంగా పాల్గొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ, "గత ప్రభుత్వ హయాంలో నల్లకుంట చెరువుకు నీరు చేరే ప్రధాన కాల్వలను పూడ్చి వేయడంతో పాటు, పట్టణ డ్రైనేజీ వ్యవస్థను నిర్లక్ష్యంగా వదిలేయడమే కారణమని ఆయన అన్నారు వాట్సాప్ నేటిని రోడ్డుపై వరద డ్రైనేజీ సమస్యలపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హామీ ఇచ్చారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News