విమాన ప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
అహ్మదాబాద్లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రతి ఒక్కరినీ కుదిపేసింది. లండన్కు బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే భూమికి పతనమైంది. ప్రమాదం జరిగిన వెంటనే విమానం నుండి దట్టమైన నల్ల పొగలు ఆకాశాన్ని కమ్మేయగా, వాటి ప్రభావం కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించింది. ఈ దృశ్యాలను చూసిన స్థానికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు.విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 12 మంది ఎయిర్ లైన్స్ సిబ్బంది ఉన్నారు. ఈ విషాద ఘటనపై దేశవ్యాప్తంగా ప్రముఖులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.నటి జాన్వీ కపూర్ స్పందిస్తూ, “ఈ వార్త నన్నెంతో కలిచివేసింది. అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోవడం బాధాకరం. ఆ బాధను మాటల్లో చెప్పలేను,” అంటూ ఆమె స్పందించారు.
స్టార్ హీరో అల్లు అర్జున్, “విమాన ప్రమాద వార్త వినగానే నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,” అంటూ ట్వీట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్, “ఈ ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. ప్రయాణికుల కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నాను,” అన్నారు.
అభినేతా మంచు విష్ణు ఈ ఘటనపై స్పందిస్తూ, “దీంతో నాకు షాక్ లాంటి అనుభూతి కలిగింది. రేపు జరగాల్సిన ‘కన్నప్ప’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ను రద్దు చేస్తున్నాను,” అని వెల్లడించారు.
ఇక బాలీవుడ్ నటులు కూడా స్పందించారు. “ఈ వార్త నన్ను షాక్కు గురిచేసింది. మాటలు రావడంలేదు,” అంటూ అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. “ప్రాణాలతో బయటపడిన వారికి తక్షణ సాయం అందించాలని కోరుకుంటున్నాను,” అని దిశా పటాని పేర్కొన్నారు.
రకుల్ ప్రీత్ సింగ్, అనుపమ్ ఖేర్, రితేష్ దేశ్ముఖ్, ప్రగ్యా జైస్వాల్ వంటి పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ సానుభూతిని తెలియజేశారు.
Comment List