* జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభోత్సవం రోజు పండగ వాతావరణంలా ఉండాలి * జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి 

* జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభోత్సవం రోజు పండగ వాతావరణంలా ఉండాలి * జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి 

రంగారెడ్డి, (లోకల్ గైడ్ ): పాఠశాలలు పున ప్రారంభం పండగ వాతావరణంలా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించాడు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి బడి బాట,  వనమహోత్సవం,  ఇంద్ర మహిళా శక్తి తదితర అంశాలపై విద్యాశాఖ, అటవీశాఖ, డిఆర్డిఏ పిడి, ఎంపీడీవోలు తహసిల్దార్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలకు తోరణాలు కట్టి విద్యార్థులకు వారి తల్లిదండ్రుల కు స్వాగతం పలకాలని అన్నారు. ఈ వారం రోజులు బడిబాట కార్యక్రమంలో ఎంపీడీవోలు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు స్పెషల్ డ్రైవ్ చేపట్టి బడిబాట కార్యక్రమంలో భాగంగా బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి అన్ని సదుపాయాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తెలిపారు. విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థుల సంఖ్య అధికంగా పెంచాలని అతి తక్కువ పిల్లలు ఉన్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలని, లేని యెడల వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ అన్నారు.
కిచెన్ రూమ్స్, స్టోర్ రూమ్ లలో, పరిసరాలు, పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. పాఠశాలల ప్రారంభం రోజున పిల్లలకు పాఠ్య పుస్తకాలు నోట్ బుక్స్, ఒక జత స్కూల్ యూనిఫాం దుస్తులు తప్పకుండా అందజేయాలని అధికారులకు సూచించారు. జూన్ 12న అంగన్వాడి కేంద్రాల పున ప్రారంభోత్సవం రోజున పిల్లలు వారి తల్లిదండ్రులు వచ్చేలా పెద్ద ఎత్తున క్యాంపు నిర్వహించాలని,అంగన్వాడి కేంద్రాలను ఆరోజున మంచిగా అలంకరణ  చేయాలని అన్నారు. అమ్మ మాట అంగన్వాడీ బంగారు బాట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని జూన్ 12 నుండి 16 వరకు నిర్వహించే కార్యక్రమంలో పోషకాహారం పై అవగాహన కల్పించాలని అన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న 160 పాఠశాలలో ప్రత్యేక శ్రద్ధ వహించి పని చేయాలని,  స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలని విద్యాశాఖ అధికారులను ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. 
వన మహోత్సవం పై కలెక్టర్  సంబంధిత అధికారులతో మాట్లాడుతూ తాసిల్దారులు ఎంపీడీవోలు తమ తమ మండలాలకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు మొక్కలు  నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించాలని, అంతకుముందు ఉన్న పల్లె ప్రగతి స్థలాల్లో పాఠశాలలో ప్రభుత్వ సంస్థల్లో మొక్కలు పెద్ద ఎత్తున నాటేందుకు సిద్ధం చేసుకోవాలని అన్నారు. హెచ్ఎండిఏ నుండి ఇంకా ఎక్కడి నుండైన మొక్కలను తెప్పించి సకాలంలో రోడ్లకు ఇరువైపులా నాటేందుకు స్థలాలను గుర్తించాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రకృతి వనంలో డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అతి తక్కువగా లక్ష్యాలను చేరుకున్న మండల అధికారులను కలెక్టర్ కారణాలను ఆరా తీశారు.

ఇందిరా మహిళా శక్తి పతాకంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ  సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉండాలని, మహిళా శక్తిని బలోపేతం చేయాలని అన్నారు. సోలార్ ప్లాంట్ల కు స్థలాలు గుర్తించిన కేశంపేట తలకొండపల్లి మండలాల అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ మండల కేంద్రాల్లో జన సమీకరణ ఉన్న కూడళ్లలో ఏర్పాటు చేయుటకు స్థలాలను వెంటనే గుర్తించాలని డిఆర్డిఏ పీడిని ఆదేశించారు. దివ్యాంగుల సదర్ సర్టిఫికెట్లు కొరకు సదరన్ క్యాంపులను వనస్థలిపురం గాంధీ హాస్పిటల్లో వెంటనే ఏర్పాటు చేయాలని నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్త మహిళా శక్తి క్యాంటీన్ స్థలాలను గుర్తించాలని అన్నారు బడి పిల్లలకు దుస్తులు పంపంకంలో ఎలాంటి జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

*జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి *జడ్చర్లలో భారీ వర్షం నేతాజీచౌరస్తా వద్ద ట్రాఫిక్ జామ్,*ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
  మిడ్జిల్ (లోకల్ గైడ్): జడ్చర్లలో కురిసిన భారీ వర్షం కారణంగా, జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నేతాజీ చౌరస్తా వైపు వెళ్లే ప్రధాన రహదారిపై గురువారం భారీగా
విమాన ప్ర‌మాద ఘ‌ట‌న‌పై తీవ్ర విచారం వ్య‌క్తం చేసిన ఎన్టీఆర్, అల్లు అర్జున్, జాన్వీ ......
మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై విమానం కుప్పకూలిన దారుణ ఘటన
వంగూరులో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కృషి
రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన
చిరువ్యాపారులకు భరోసా ఇచ్చిన మహేశ్వరం నియోజకవర్గం