తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి

పాలకుర్తి (లోకల్ గైడ్)
పాలకుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి కి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పదవి లభించిన సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు,   మహేష్ కుమార్ గౌడ్ ని హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, తనకు అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు..ఈ సందర్భంగా పాలకుర్తి శాసనసభ్యురాలు  యశస్విని రెడ్డి కూడా పాల్గొని అభినందనలు తెలియజేశారు.పార్టీ పట్ల నిబద్ధతకు ఇది గుర్తింపు, బాధ్యతగా భావించి ప్రతి ఒక్క కార్యకర్తను మద్దతుగా నడిపించేందుకు కృషి చేస్తాను అని ఝాన్సీ రాజేందర్ రెడ్డి  పేర్కొన్నారు.పాలకుర్తి నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళిన ఈ పదవి, మహిళా నేతలకు ప్రేరణగా నిలుస్తుంది అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News