అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీకి ఐదోస్థానం.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?

అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీకి ఐదోస్థానం.. ఇంకా జాబితాలో ఏయే నగరాలు ఉన్నాయంటే..?

ఏప్రిల్ నెలలో దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ ఐదవ స్థానాన్ని సంపాదించింది. వేసవి కాలంలోనూ ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందకపోవడం గమనార్హం. వేసవిలోనే ఇంత కాలుష్యం ఉంటే, శీతాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశముందని ఇది సూచిస్తుంది. అయితే, ఈ నెలలో 80 శాతం రోజుల్లో కాలుష్యం సాధారణ స్థాయిలోనే ఉన్నట్లు 'సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA)' తాజా నివేదిక వెల్లడించింది.దేశంలోని 273 నగరాల్లో 248 నగరాలలో (సుమారు 90 శాతం) కాలుష్య స్థాయిలు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాలను మించాయని నివేదిక చెబుతోంది. అందులో 227 నగరాల్లో పీఎం 2.5 స్థాయిలు భారత జాతీయ ప్రమాణాలను కూడా అధికంగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఢిల్లీలో సగటు PM 2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 119 మైక్రోగ్రాములుగా నమోదైంది. ఈ స్థాయి తక్షణంగా ప్రాణాపాయంగా కాకపోయినా, దీర్ఘకాలంగా ఈ కాలుష్యానికి గురైతే శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలగవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.అత్యంత కాలుష్యిత నగరాల జాబితాలో సివాన్, రాజ్‌గిర్, ఘజియాబాద్, గురుగ్రామ్, హాజీపూర్, బాగ్‌పత్, ఔరంగాబాద్, ససరాం, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. వీటిలో బీహార్‌కు చెందిన ఐదు నగరాలు ఉండగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రెండు, అస్సాం, హర్యానా, ఢిల్లీకి ఒక్కో నగరం చొప్పున ఉన్నాయి. ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో కాలుష్య స్థాయి అత్యంతగా ఉన్నప్పటికీ, మిగతా రోజులలో తగ్గినా, వార్షిక సగటు పరంగా ఇది ఇంకా ఎక్కువగానే ఉందని CREA నివేదిక స్పష్టం చేసింది.


Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన