భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు

భారత్‌లో 7,400కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు… 87కు చేరిన మరణాలు

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. రోజుకోటీ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 269 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా కర్ణాటకలో 132 కేసులు వెలుగులోకి వచ్చాయి.దీంతో దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,400కి చేరింది. రాష్ట్రాల వారీగా చూస్తే, కేరళలో 2,109 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గుజరాత్‌లో 1,437, పశ్చిమ బెంగాల్‌లో 747, ఢిల్లీలో 672, మహారాష్ట్రలో 613, కర్ణాటకలో 527 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.కరోనా కారణంగా నిన్న ఒక్క రోజులో తొమ్మిది మంది మృతి చెందారు. మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్‌, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. ఫలితంగా ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 87కి పెరిగింది. మరోవైపు కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 11 వేలు దాటింది. ఇప్పటి వరకు 11,967 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
    అల్లు అర్జున్‌కు గద్దర్ అవార్డ్ ప్రదానం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.   తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు
ఫార్మాస్యూటికల్ పరిశోధనలో
నీట్-2025 ఫలితాలలో రెజో మెడికాన్ ప్రభంజనం
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...
కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో కనివిని ఎరుగనీ రీతిలో స్కామ్‌... నిరుపేదలకు అందని ద్రాక్షగా వ్యాపారంగా మారిన విద్య...
స్వధార్ హోమ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా మానిటరింగ్ కమిటీ...గతంలో నిర్వహణ లోపంపై కలెక్టర్ కు ఫిర్యాదు...
చక్రపురి కాలనీలో నిర్మిస్తున్న శివాలయంను పరిశించిన