కట్ రా- కాజీగుండ్ మార్గంలో ప్రత్యేక బలగాలు....
లోకల్ గైడ్ :
పర్వతాలతో చుట్టుముట్టిన జమ్మూ కశ్మీర్లో రవాణా వ్యవస్థను వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ప్రణాళికలు కార్యరూపం దాల్చుతున్నాయి. కట్-కాజీగుండ్ సెక్షన్లో కొత్తగా నిర్మించిన చినాబ్ వంతెనపై ప్రత్యేక రైలు ప్రయోగాత్మకంగా విజయవంతంగా నడిపారు. ఈ రైలు ప్రత్యేక భద్రత ఏర్పాట్లతో ప్రయాణిస్తూ రౌండ్ ట్రిప్ను విజయంగా పూర్తి చేసింది.భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రైలు మార్గం ప్రారంభం కావడం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కశ్మీర్తో దేశం మిగిలిన ప్రాంతాల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తోంది. ఈ మార్గంలో రైలు సేవల ప్రారంభంపై సరిహద్దు ఉద్రిక్తతలు ప్రభావం చూపలేదని ఈ ప్రయోగం స్పష్టం చేస్తోంది.ఈ ట్రైల్ రన్ విషయాన్ని నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షూ శేఖర్ ఉపాధ్యాయ్ ధృవీకరించారు. చినాబ్ వంతెనపై ఈ మార్గం ద్వారా కశ్మీర్ దేశం మిగతా ప్రాంతాలకు అనుసంధానమవుతోంది.
కట్ స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరిన రైలు, రాత్రి 6 గంటలకు తిరిగి అక్కడికే చేరుకుంది. మొదట ఈ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించాల్సి ఉన్నా, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడింది.ఈ స్పెషల్ రైల్లో సెలవులు ముగించుకుని విధుల్లోకి తిరిగి వెళ్లుతున్న సైనికులు ప్రయాణించారు. జమ్మూ-కశ్మీర్లో పౌరవిమాన సర్వీసులు రద్దయిన సమయంలో వారికి ఇది ఏకైక రవాణా మార్గంగా మారింది. ప్రస్తుతం ఈ రైలు కట్-కాజీగుండ్ వరకు మాత్రమే నడుస్తోంది, సాధారణంగా ఇది బారాముల్లా-కాజీగుండ్ వరకు ఉంటుంది.ఇది రోడ్డు రవాణాకు తోడుగా సైన్యం, ఆయుధాలను వేగంగా తరలించేందుకు ఉపయోగపడనుంది.
Comment List