రాజ్ భవన్ హార్డ్ డిస్క్ దొంగతనం: దర్యాప్తులో షాకింగ్ సంఘటన |

హైదరాబాద్‌లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్ డిస్కులు మాయం – సీసీ టీవీ ఆధారంగా హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ అరెస్ట్

రాజ్ భవన్ హార్డ్ డిస్క్ దొంగతనం: దర్యాప్తులో షాకింగ్ సంఘటన |

రాజ్ భవన్ హార్డ్ డిస్క్ దొంగతనం యొక్క షాకింగ్ వివరాలను కనుగొనండి: దర్యాప్తులో షాకింగ్ సంఘటన. కీలకమైన ఫైల్‌లు మరియు నివేదికలతో కూడిన ఈ సంఘటన సుధర్మ భవన్‌లో జరిగింది మరియు విస్తృతమైన CCTV సమీక్ష తర్వాత బయటపడింది. లోతైన అంతర్దృష్టుల కోసం స్థానిక గైడ్‌తో పరిశోధనను అన్వేషించండి.

లోకల్ గైడ్  హైదరాబాద్, మే 20:
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోటుచేసుకున్న హార్డ్ డిస్కుల చోరీ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మే 13న రాత్రి రాజ్‌భవన్ పరిధిలోని సుధర్మ భవన్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సుదీర్ఘ సీసీటీవీ పరిశీలన అనంతరం, కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడ్డట్లు గుర్తించి, పోలీసులు మే 14న అతన్ని అరెస్ట్ చేశారు.

రాజ్‌భవన్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం, మొదటి అంతస్తులోని కంప్యూటర్ గదిలో నిల్వ ఉన్న నాలుగు హార్డ్ డిస్కులు గల్లంతయ్యాయి. ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ టీవీ ఫుటేజీని విశ్లేషించగా, హెల్మెట్ ధరించిన వ్యక్తి కంప్యూటర్ గదిలోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఆ వ్యక్తి హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్‌గా నిర్ధారణ అయింది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ హార్డ్ డిస్కుల్లో రాజ్‌భవన్ కార్యకలాపాలకు సంబంధించి కీలక ఫైళ్ళు, రిపోర్టులు ఉన్నట్టు సిబ్బంది పేర్కొన్నారు. ఇది కేవలం ఒక సాధారణ చోరీ కాదు, భద్రతా పరంగా అత్యంత సున్నితమైన అంశమని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసును మరింత లోతుగా పరిశీలిస్తున్న పోలీసులు, శ్రీనివాస్ ఈ చోరీ వెనుక ఉద్దేశ్యం ఏమిటి? ఎవరైనా సహకరించారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటే, రాజ్‌భవన్ వంటి అత్యున్నత స్థాయి భద్రతా ప్రాంతంలో ఈ తరహా దొంగతనాన్ని చేపట్టడం, అక్కడి సెక్యూరిటీ వ్యవస్థలపై అనేక అనుమానాలు ఏర్పడేలా చేసింది. అధికార వర్గాలు ఈ ఘటనపై అంతర్గత విచారణకూ శ్రీకారం చుట్టాయి.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు లక్ష్మీ దేవి ఆశీస్సుల కోసం మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులు
లక్ష్మీ దేవి ఆశీస్సులు పొందడానికి మీ పర్సులో ఉంచుకోవాల్సిన 5 ముఖ్యమైన వస్తువులను కనుగొనండి. ఈ వస్తువులు మీ జీవితంలో శ్రేయస్సును ఎలా ఆకర్షిస్తాయో మరియు శుభ...
వరంగల్ రైల్వే స్టేషన్ ను ప్రజలకు అంకితం చేసిన మోడీ
అర్హత కలిగిన పేద కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
చేయూత పెన్షన్లను సక్రమంగా పంపిణీ చేయాలి.
శిల్పారామంలో ప్రపంచ సుంద‌రీమ‌ణుల సంద‌డి 
అండర్‌-19 జట్టుకెప్టెన్‌గా ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్‌గా అభిజ్ఞాన్ కుండు