జీలుగ పంటతో భూసారాన్ని పెంచండి
- అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప.
అలంపూర్, లోకల్ గైడ్ :
జీలుగ పంటతో భూసారాన్ని పెంచాలని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప అన్నారు. గురువారం అయిజ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) ఆవరణలో జీలుగ విత్తనాల విక్రయాన్ని పిఎసిఎస్ చైర్మన్ పోతుల మధుసూదన్ రెడ్డి తో కలిసి అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొలాల్లో భూసారాన్ని పెంచేందుకు ప్రభుత్వం సబ్సిడీతో జీలుగా సరఫరా చేస్తోందని క్వింటాల్ జీలుగ విత్తనాల ధర బహిరంగ మార్కెట్లో క్వింటాల్ కు రూ.14250 ఉండగా 50 శాతం సబ్సిడీతో రూ: 7125 లకు అందజేస్తుందన్నారు. ప్రస్తుతం 30 కేజీల జీలుగ విత్తనాల ధర సబ్సిడీతో రూ:2137.50 రైతులకు అందిస్తామన్నారు. జీలుగ విత్తనాలు కావలసిన రైతులు తమ పట్టాదారు పాసుబుక్కు, ఆధార్ జిరాక్స్ కాపీలతో స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని రైతు వేదికలో అధికారులను సంప్రదించాలన్నారు. రెండున్నర ఎకరాలకు ఒక 30 కేజీల బస్తా చొప్పున ఇవ్వనట్లు, రైతు వేదికలో పర్మిట్ పొంది సింగిల్ విండో కార్యాలయంలో నగదు చెల్లించి జీలుగ విత్తనాలను తీసుకెళ్లాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జనార్ధన్ వ్యవసాయ విస్తరణ అధికారులు లోకరాజ్, సతీష్ కార్యదర్శి మల్లేష్ కాంగ్రెస్ నాయకుడు బసవరాజ్ వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.
Comment List